News August 10, 2025
పులిచెర్ల: 11న పీజీఆర్ఎస్కు హాజరుకానున్న కలెక్టర్

పులిచెర్ల మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తో పాటు జిల్లా స్థాయి అధికారులు హాజరవుతున్నట్లు తహశీల్దార్ జయసింహ తెలిపారు. పులిచెర్ల, రొంపిచెర్ల మండల ప్రజలు తమ సమస్యలను ఈ కార్యక్రమంలో తెలియజేయవచ్చన్నారు. ప్రజలు సహకరించాలన్నారు.
Similar News
News August 13, 2025
వీకోట: అదుపుతప్పి చెరువులో పడి బాలుడి మృతి

చెరువులో పడి ఆరో తరగతి విద్యార్ధి మృతిచెందిన సంఘటన వి.కోట మండలంలో జరిగింది. యాలకల్లు గ్రామానికి చెందిన నాగరాజు, కల్పన దంపతుల కుమారుడు భార్గవ్ (11) వికోట పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. సాయంత్రం పాఠశాల నుంచి వచ్చిన అనంతరం గ్రామ సమీపంలోని చెరువు వద్దకి వెళ్లి అదుపుతప్పి పడిపోయాడు. స్థానికులు గుర్తించి బయటకు తీసి ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందాడు.
News August 12, 2025
CTR: మూడుకు చేరిన మృతుల సంఖ్య

పళ్లిపట్టు వద్ద మంగళవారం జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. GDనెల్లూరు(M) గోవిందరెడ్డిపల్లికి చెందిన YCP నాయకుడు సురేంద్ర రెడ్డి కుటుంబంతో కలిసి కావడి మొక్కులు చెల్లించేందుకు తిరుత్తణికి కారులో బయల్దేరారు. అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో వాహనం బోల్తా కొట్టింది. ఆయన తమ్ముడు చిన్నబ్బరెడ్డి, పద్మ అక్కడికక్కడే మృతిచెందారు. నెలలైనా నిండని మనవడు సైతం చనిపోవడంతో మృతుల సంఖ్యకు మూడుకు చేరింది.
News August 12, 2025
ద్రావిడ వర్సిటీ: ద.రాష్ట్రాల విద్యార్థుల కోసం దరఖాస్తులు

ద్రావిడ వర్సిటీలో 2025-26 సంవత్సరానికి సంబంధించి దక్షిణ రాష్ట్రాల విద్యార్థుల కోసం UG&PG కోర్సులలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య కిరణ్ కుమార్ తెలిపారు. వారికి 10 శాతం రిజర్వేషన్ కలదన్నారు. ఆసక్తి, అర్హులైన విద్యార్థులు వర్సిటీలో ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.