News August 10, 2025
నేడు బెంగళూరులో పర్యటించనున్న మోదీ

నేడు ప్రధాని మోదీ బెంగళూరు మెట్రోరైలు ఎల్లో లైన్, వందేభారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. దాదాపు 4 గంటలపాటు ప్రధాని పర్యటన కొనసాగనుంది. ఉ.10.30గం.కు ఆయన బెంగళూరు చేరుకుంటారు. హెలికాప్టర్, రోడ్డు మార్గంలో KSR బెంగళూరు సిటీ జంక్షన్ రైల్వేస్టేషన్కు వెళ్తారు. అక్కడ KSR బెంగళూరు-బెలగావి మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత RVరోడ్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్లో లైన్ను ప్రారంభిస్తారు.
Similar News
News August 13, 2025
భార్యకు తోడుగా ఉండేందుకు రూ.1.2కోట్ల జాబ్ మానేశాడు!

బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి గర్భవతి అయిన భార్యకు తోడుగా ఉండేందుకు రూ.1.2కోట్ల వార్షిక వేతనం వచ్చే ఉద్యోగానికి రిజైన్ చేశారు. ఈ విషయాన్ని ఆయన రెడిట్లో పోస్ట్ చేశారు. ‘నేను ఓ కాలేజీ డ్రాపౌట్. ఏడేళ్లలోనే రూ.7 కోట్లు సంపాదించా. నా భార్యను ఉద్యోగం మానేసి రెస్ట్ తీసుకోవాలని చెప్తే ఆమె వినలేదు. అందుకే నేనే జాబ్ వదిలేశా. తన డెలివరీ తర్వాత నా అనుభవం & పరిచయాలతో మళ్లీ ఉద్యోగం సంపాదిస్తా’ అని పేర్కొన్నారు.
News August 13, 2025
విజయవాడ ఏసీబీ కోర్టుకు మిథున్ రెడ్డి

AP: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలించారు. ఈ కేసులో రిమాండ్ ముగియడంతో కోర్టు విచారణ ప్రారంభించింది. కాగా గత నెల 20 నుంచి మిథున్ రాజమండ్రి జైలులోనే ఉన్న విషయం తెలిసిందే.
News August 13, 2025
వార్-2 X కూలీ.. దేనికి వెళ్తున్నారు?

భారీ బడ్జెట్ సినిమాలైన వార్-2, కూలీ రేపు విడుదలకానున్నాయి. ఇవి డైరెక్ట్ తెలుగు సినిమాలు కాకపోయినా వార్-2లో ఎన్టీఆర్, కూలీలో నాగార్జున నటిస్తుండటంతో వీటిపై మన దగ్గర హైప్ పెరిగిపోయింది. అందుకు తగ్గట్టు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలనూ పెంచేశారు. ఇప్పటికే టికెట్ బుకింగ్స్ ప్రారంభమవగా ప్రీసేల్స్లో రెండూ దూసుకెళ్తున్నాయి. మరి మీరు ఏ మూవీకి వెళ్తున్నారు? తొలి రోజు ఎన్ని కోట్లు వస్తాయో కామెంట్ చేయండి.