News March 31, 2024
చిత్తూరు జిల్లాలో పెరుగుతున్న ఎండలు

రోజు రోజుకు పెరుగుతున్న ఎండలతో చిత్తూరు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పులిచెర్ల మండలంలో అత్యధికంగా 41.9 డిగ్రీలు, రామకుప్పంలో అత్యల్పంగా 36.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిండ్రలో 41.7, SRపురంలో 41.4, తవణంపల్లె, నగరిలో 41.1, బంగారుపాళ్యం, పలమనేరులో 41, గుడుపల్లెలో 40.6, పుంగనూరులో 40.3, గుడిపాలలో 40, శాంతిపురం, సదుం, వెదురుకుప్పంలో 39.2, సోమల, రొంపిచెర్ల, చౌడేపల్లెలో 39.1 డిగ్రీలు నమోదైంది.
Similar News
News January 12, 2026
చిత్తూరులో ఘనంగా వివేకానంద జయంతి

చిత్తూరులోని వివేకానంద పార్కులో స్వామి వివేకానంద జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పలువురు నివాళులు అర్పించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే తండ్రి చెన్నకేశవుల నాయుడు హాజరయ్యారు. ఆయన పలువురికి హిందూ సమ్మేళన పురస్కారాలను పంపిణీ చేశారు. వివేకానందుడు చూపిన మార్గం యువతకు ఆదర్శనీయమని కొనియాడారు.
News January 12, 2026
చిత్తూరు జాయింట్ కలెక్టర్గా ఆదర్శ్ రాజేంద్రన్

చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్గా ఆదర్శ్ రాజేంద్రన్ను నియమిస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న ఆయన చిత్తూరుకు బదిలీ అయ్యారు. చిత్తూరులో JC విద్యాధరి విశాఖపట్నం జాయింట్ కలెక్టర్గా బదిలీ అయ్యారు.
News January 12, 2026
GDనెల్లూరు: CHC పూర్తయితే కష్టాలు తీరేనా.?

కార్వేటినగరం PHCలో ఇద్దరు డాక్టర్లు, నలుగురు నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్స్, ఫార్మసిస్ట్, హెల్త్ అసిస్టెంట్ విధులు నిర్వహిస్తున్నారు. 50 పడకల CHC పూర్తయితే సివిల్ సర్జన్లు, మెడికల్ ఆఫీసర్లు, గైనకాలజిస్ట్, పీడియాట్రీషియన్, అనస్థీషియా నిపుణులు అందుబాటులో ఉండనున్నారు. ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, క్లాస్–4 సిబ్బంది అందుబాటులోకి రావడంతో వైద్య సేవలు మెరుగుపడతాయని స్థానికులు అంటున్నారు.


