News August 10, 2025
భారీగా పడిపోయిన ధరలు

అమెరికా టారిఫ్ల ప్రభావం ఏటా రూ.20 వేల కోట్ల ఎగుమతులు చేసే APలో ఆక్వా రంగంపై పడింది. ట్రంప్ 50% సుంకం విధించడంతో ఉమ్మడి గోదావరి, కృష్ణా, GNT, ప్రకాశం, NLR జిల్లాల రైతుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. సుంకం పెంచుతున్నట్లు ఆయన చెప్పగానే ఎగుమతిదారులు రొయ్యల ధరలను భారీగా తగ్గించేశారు. 25 కౌంట్ KG రొయ్య ధర ₹565 నుంచి ₹430కు తగ్గింది. మిగతా వాటి ధరలూ KGపై ₹35-80 మేర తగ్గాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.
Similar News
News August 11, 2025
నిద్రలో కాళ్లు, చేతులు మొద్దుబారుతున్నాయా?

నిద్రలో కొందరికి చేతులు, కాళ్లు మొద్దుబారిపోతుంటాయి. ఇది ఒక రకమైన ఆరోగ్య సమస్య అని వైద్యులు చెబుతున్నారు. మణికట్టు నరాలపై ఒత్తిడి పెరిగితే వేళ్లు, సయాటిక్ నాడీపై ఒత్తిడి పెరిగితే కాళ్లు, మోచేతి నరాలపై ఒత్తిడి పెరిగితే చేతులు తిమ్మిరి ఎక్కుతాయి. విటమిన్ B12, B6, మెగ్నీషియం లోపం వల్ల నరాలు బలహీనపడి ఒత్తిడికి గురవుతాయి. మెరుగైన రక్త ప్రసరణకు వ్యాయామం చేయాలని, సమతుల ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు.
News August 11, 2025
APలో మైండ్ట్రీ పెట్టుబడులు

AP:అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ప్రముఖ టెక్ సంస్థ LTIMindtree పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ‘దేశంలో మొట్టమొదటి క్వాంటమ్ టెక్నాలజీ హబ్ను రూపొందించడంలో కీలకపాత్ర పోషిస్తున్నందుకు గర్వంగా ఉంది. L&T, IBM, AP GOVTతో కలిసి ప్రపంచస్థాయి క్వాంటమ్ ఎకో సిస్టమ్ను ఆవిష్కరిస్తాం. మా క్వాంటమ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ డీప్ టెక్ రీసెర్చ్, ఇంక్యుబేషన్, ఆవిష్కరణలకు నాయకత్వం వహిస్తుంది’ అని Xలో వెల్లడించింది.
News August 11, 2025
ఆక్వా రంగం నష్టపోకుండా చర్యలు: అచ్చెన్నాయుడు

AP: ట్రంప్ టారిఫ్ల ప్రభావం భారత్తో పాటు అన్ని దేశాలపై పడిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ రంగానికి <<17357620>>నష్టం <<>>లేకుండా అన్ని చర్యలు చేపడతామని వెల్లడించారు. ఎల్లుండి ఆక్వా రంగంపై సమావేశం నిర్వహిస్తామని, అభివృద్ధికి నిపుణుల అభిప్రాయాలు తీసుకుంటామని చెప్పారు. సమస్యను అధిగమించేందుకు కేంద్రంతో కలిసి పనిచేస్తామని వెల్లడించారు.