News August 10, 2025
గాజువాక సమీపంలో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

గాజువాక సమీపంలో జగ్గు జంక్షన్ కర్నవాణిపాలెం వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ను ట్రాలర్ ఢీకొట్టిన ఘటనలో ఏ.మోహన్ కుమార్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు గాజువాక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు అదే ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించారు.
Similar News
News August 12, 2025
రాష్ట్రంలో మొదటిసారి విశాఖలోనే: సీపీ

విశాఖలో లోన్ యాప్ మోసాలతో 295 మంది వరకు బాధితులను గుర్తించినట్లు సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. సైబర్ క్రైమ్ ఇన్స్టంట్ లోన్ యాప్ కేసులో గుర్తించిన క్రిపో కరెన్సీని ఇండియా కరెన్సీలోకి మార్చి వందమంది బాధితులకు రూ.50 లక్షలను మంగళవారం అందించారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఇటువంటి సహాయం విశాఖలో చేసినట్లు తెలిపారు. సైబర్ మోసాలకు ప్రజలు గురికా వద్దని సీపీ సూచించారు.
News August 12, 2025
విశాఖ జూపార్క్లో ప్రపంచ ఏనుగుల దినోత్సవం

విశాఖ జూ పార్క్లో క్యూరేటర్ మంగమ్మ ఆధ్వర్యంలో మంగళవారం ప్రపంచ ఏనుగుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఇందిరాగాంధీ జూ పార్క్లో ప్రస్తుతం కృష్ణ, రాజు, సరస్వతి, లక్ష్మీ అనే నాలుగు ఏనుగులు ఆరోగ్యంగా ఉన్నాయని జూపార్క్ సిబ్బంది వివరించారు.
News August 12, 2025
మృతుని వివరాలు తెలిస్తే చెప్పిండి: ఆరిలోవ ఎస్ఐ

ఆదివారం అర్ధరాత్రి ఓల్డ్ డైరీ ఫార్మ్ సమీపంలో పశువులు అక్రమంగా తరలిస్తున్న వ్యాను ఢీకొని సుమారు 40 సంవత్సరాల గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. అయితే ఇప్పటివరకు మృతుని వివరాలు తెలియలేదు. వ్యక్తి వివరాలు గుర్తుపట్టిన వారు వెంటనే ఆరిలోవ పోలీసులకు తెలియజేయాలని ఎస్ఐ వై.కృష్ణ సూచించారు. ప్రస్తుతం మృతదేహం మార్చురీలో భద్రపరిచారు.