News August 10, 2025
చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తున్నారు: జగన్

AP: CM చంద్రబాబు అరాచకాలకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తున్నారని YCP అధినేత జగన్ ఫైరయ్యారు. ‘పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉప ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి TDP గూండాలు, కొంతమంది అధికారులు, పోలీసులు మా పార్టీ శ్రేణులపై దాడులు చేస్తున్నారు. YCP ఓటర్లను ఇబ్బందిపెట్టేందుకు 4KM దూరంలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దేవుడు, ప్రజలపై నమ్మకం ఉంది. ధర్మమే గెలుస్తుంది’ అని ట్వీట్ చేశారు.
Similar News
News August 13, 2025
పైరసీ పెరగడానికి నిర్మాతలు, ప్రభుత్వాలే కారణమా?

సినిమా పైరసీ పెరగడానికి నిర్మాతలు, GOVTలే పరోక్షంగా కారణమనే సమాధానాలు అభిమానుల నుంచి వినిపిస్తున్నాయి. కొత్త సినిమాలకు ప్రత్యేక రేట్లతో స్పెషల్ <<17383707>>GOలిస్తూ <<>>జేబులు గుల్ల చేస్తున్నాయి. ఒక టికెట్ ₹500-800 అయితే, పాప్కార్న్ ఖర్చు కలిపి ఇద్దరు వెళ్తే ₹2000 ఆవిరి కావాల్సిందే. OTTలో చూడాలంటే ఆ రేట్లు భరించలేక ప్రతీ సినిమాకు స్పెషల్ రేట్లు పెట్టలేక పైరసీ వైపు మొగ్గుచూపుతున్నట్లు అభిమానులు చెబుతున్నారు.
News August 13, 2025
గూగుల్ క్రోమ్ కోసం ‘పెర్ప్లెక్సిటీ AI’ భారీ ఆఫర్

GOOGLE క్రోమ్ కోసం పెర్ప్లెక్సిటీ AI సంస్థ 34.5 బిలియన్ డాలర్లు ఆఫర్ చేసినట్లు పేర్కొంది. గూగుల్ బ్రౌజర్కు అది చాలా తక్కువ కావొచ్చు. కానీ, పెర్ప్లెక్సిటీకి చాలా పెద్ద మొత్తం. ఆ మొత్తాన్ని ఎలా సమీకరిస్తారో కూడా వెల్లడించలేదు. ఆన్లైన్ సెర్చ్లో గుత్తాధిపత్యం సరికాదని.. క్రోమ్ను అమ్మేయాలని గతేడాది US కోర్ట్ సూచించింది. దానిపై ఆ సంస్థ పోరాడుతుంది గానీ, బ్రౌజర్ని అమ్మదని నిపుణులు చెబుతున్నారు.
News August 13, 2025
హైదరాబాద్లో మొదలైన వర్షం

హైదారాబాద్లో వర్షం మొదలైంది. వాతావరణ నిపుణులు చెప్పినట్లుగానే అర్ధరాత్రి 2 గంటల నుంచి వర్షం కురవడం ప్రారంభమైంది. ఈశాన్య భాగం నుంచి వర్షం మొదలైంది. 3 గంటల కల్లా మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని చెప్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం వంటి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు.