News August 10, 2025
సెప్టెంబర్ 14న విశాఖలో ‘నేషనల్ డాగ్ షో’

సెప్టెంబర్ 14న విశాఖలో గాదిరాజు ప్యాలెస్లో ‘నేషనల్ డాగ్ షో’ నిర్వహించనున్నట్లు విశాఖ కెన్నెల్ అసోసియేషన్ సెక్రటరీ కృష్ణ తెలిపారు. ఈ మేరకు ఆర్ & బి జంక్షన్ వద్ద ఆదివారం పోస్టర్ ఆవిష్కరించారు. ఈ డాగ్ షోలో దేశం నలుమూలల నుంచి ఊటి, కోడాయికెనాల్, ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కోల్కతా, జార్ఖండ్, చత్తీస్ఘడ్ వంటి వివిధ ప్రదేశాల నుంచి 50 జాతులు, 300 శునకాలు పాల్గొంటాయన్నారు.
Similar News
News August 13, 2025
భారీ వర్షాలు.. అప్రమత్తం చేసిన విశాఖ కలెక్టర్

భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను విశాఖ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ బుధవారం అప్రమత్తం చేశారు. సచివాలయ సిబ్బంది సెక్రటరీలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రజలకు సరిపడా మందుల నిలువను ఉంచాలని డిఎంహెచ్ఓకు కలెక్టర్ ఆదేశించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకుండా ఉండాలని, వారికి పునరావస కేంద్రాలను ఏర్పాటు చేయాలని తహశీల్దార్లకు సూచించారు. బస్సులర పర్యవేక్షణ చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.
News August 13, 2025
విశాఖను మాదక ద్రవ్య రహిత జిల్లాగా తీర్చుదిద్దుదాం: కలెక్టర్

విశాఖను మాదక ద్రవ్య రహిత జిల్లాగా తీర్చుదిద్దదామని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ పిలుపునిచ్చారు. నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రతిజ్ఞలో భాగంగా కలెక్టరేట్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి అధికారులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. యువత పెద్ద సంఖ్యలో మాదక ద్రవ్య నిర్మూలనలో భాగస్వామ్యం కావాలని కోరారు.
News August 13, 2025
విశాఖ: ఎన్టీఆర్ గృహ నిర్మాణాలపై కలెక్టర్ సమీక్ష

జిల్లాలోని ఎన్టీఆర్ గృహ నిర్మాణ లేఅవుట్లలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై కలెక్టర్ హరేంధీర ప్రసాద్ బుధవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇళ్లను వేగంగా పూర్తి చేయాలన్నారు. మౌలిక వసతులు అభివృద్ధి చేయడంపై దృష్టి సారించాలని సూచించారు. కాంట్రాక్టుల పనితీరుపై సమీక్షించారు.