News August 10, 2025
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ADB SP

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని SP అఖిల్ మహాజన్ సూచించారు. అపరిచితులకు OTPలు చెప్పడం, ఫోన్కు వచ్చే లింక్లు ఓపెన్ చేయడం, APK అప్లికేషన్లు డౌన్లోడ్ చేయడం వంటివి చేయకూడదన్నారు. ఈ వారం జిల్లాలో మొత్తం 21 సైబర్ క్రైమ్ కేసులు నమోదైనట్లు వెల్లడించారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సైబర్ క్రైమ్కు గురైతే https://www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News October 28, 2025
ADB: అక్రమార్కులకు రాజకీయ అండదండలు..!

జిల్లాలో కొందరు రాజకీయ నాయకుల ముసుగులో రౌడీషీటర్లు, గూండాలు అక్రమ దందాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వెలుగు చూస్తున్నాయి. నేతల అండతోనే రౌడీషీటర్లు చెలరేగిపోతున్నారని తెలుస్తోంది. ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేక దృష్టి సారించి, రౌడీషీటర్ల అక్రమ భాగోతాలను వెలికితీస్తున్నారు. బాధితులు ధైర్యంగా ముందుకు రావడంతో, పోలీసులు కొరడా ఝళిపించి ఇటీవల భూదందాలు, పలు వివాదాల్లోని రౌడీషీటర్లు, నాయకులను జైలుకు పంపారు.
News October 28, 2025
ఆదిలాబాద్లో బుధవారం పత్తి మార్కెట్ బంద్

అతి భారీ వర్షాలు పడే సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారి చేసినందుకు ఈనెల 29న పత్తి మార్కెట్ కు బంద్ ఉంటుందని మార్కెట్ అధికారులు పేర్కొన్నారు. Kapas Kisan యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకున్న రైతులు స్లాట్ను రద్దు చేసుకోవాలన్నారు. వాతావరణ పరిస్థితులను బట్టి మరుసటి పని దినాలలో స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. రైతులు ఈ విషయాన్ని గమనించి పత్తి తేవద్దన్నారు.
News October 28, 2025
ADB: నారీమణులకు దక్కిన 10 మద్యం షాపులు

కొత్త మద్యం పాలసీ 2025–27లో 34 షాపులకు గాను ఆదిలాబాద్లో ప్రశాంతంగా కొనసాగింది. ఇందులో భాగంగా 10 షాపులు మహిళలకు లక్కీడ్రా ద్వారా దక్కాయి. షాప్ నం. 2, 9 విమలబాయి దక్కించుకున్నారు. తమ కుటుంబీకులకు సంబంధించిన మహిళల పేరిట షాపులు రావడంతో వారు సంబరాల్లో మునిగితేలారు. కాగా మద్యం లక్కీడ్రాకు అధిక సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. వారు తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా, అదృష్టవంతుల పేర్లు వచ్చాయి.


