News August 10, 2025
భారీ వర్షాలు.. ప్రజలు సహకరించాలన్న మంత్రి పొన్నం

TG: వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ వాసులు ప్రజారవాణాను ఉపయోగించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. వర్షాలపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆకస్మిక భారీ వర్షాలు కురుస్తున్నాయని, వర్షం తగ్గగానే అందరూ ఒకేసారి రోడ్ల మీదకు రావడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని చెప్పారు. కాస్త సమయం తీసుకొని రోడ్లపైకి వచ్చి ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.
Similar News
News August 13, 2025
పులివెందుల: 2 కేంద్రాల్లో రీపోలింగ్

AP: పులివెందుల ZPTC ఉప ఎన్నికల్లో భాగంగా 2 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఎస్ఈసీ ఆదేశించింది. అచ్చవెల్లి, కొత్తపల్లెలో ఇవాళ రీపోలింగ్ నిర్వహించనున్నారు. 3, 14 కేంద్రాల్లో ఉ.7 గంటల నుంచి సా.5 గంటల వరకు రీపోలింగ్ జరగనుంది. ఈ కేంద్రాల్లో 2 వేల మంది ఓటర్లు ఉన్నారు. నిన్న జరిగిన పోలింగ్లో అవకతవకలు జరిగాయని మాజీ సీఎం జగన్, ఎంపీ అవినాశ్ సహా వైసీపీ శ్రేణులు ఆరోపించిన విషయం తెలిసిందే.
News August 13, 2025
E20 పెట్రోల్పై ఆ ప్రచారాలు తప్పు: కేంద్రం

E20 పెట్రోల్పై వస్తున్న <<17378231>>పుకార్లను<<>> కేంద్రం కొట్టిపారేసింది. దీని వల్ల పొల్యూషన్ తగ్గడమే కాకుండా వాహనాల పికప్ కూడా పెరుగుతుందని వెల్లడించింది. E10 పెట్రోల్తో పోలిస్తే 30% తక్కువ కార్బన్ ఉద్గారాలు వెలువడతాయని పేర్కొంది. మైలేజీ తగ్గుతుందన్న ప్రచారంలో నిజం లేదంది. డ్రైవింగ్ విధానం, వాహనం మెయింటెనెన్స్, టైర్ ప్రెషర్, AC లోడ్ వంటి వాటిపై మైలేజీ ఆధారపడి ఉంటుందని కేంద్రం వివరించింది.
News August 13, 2025
సెమీ కండక్టర్ రంగంలో వేగంగా అడుగులు: మోదీ

భారతదేశం <<17381479>>సెమీ కండక్టర్<<>> రంగంలో వేగంగా అడుగులు వేస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. AP, ఒడిశా, పంజాబ్కు సెమీ కండక్టర్ యూనిట్లు మంజూరు కావడంపై తెలుగులో ట్వీట్ చేశారు. ‘ఏపీ, ఒడిశా, పంజాబ్లో కొత్త యూనిట్ల ఏర్పాటుకు మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం తయారీ సామర్థ్యాన్ని పెంచుతుంది. అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగాలను సృష్టిస్తుంది. ప్రపంచ సరఫరా వ్యవస్థలో దేశాన్ని కీలక పాత్రధారిగా ఉంచుతుంది’ అని తెలిపారు.