News August 10, 2025

సిద్దిపేట: ‘బాల సాహిత్యంపై పరిశోధన జరగాలి’

image

బాల సాహిత్యంపై పరిశోధన జరగాలని కవి ఉండ్రాళ్ళ రాజేశం, పెందోట వెంకటేశ్వర్లు, ఎడ్ల లక్ష్మి, కాల్వ రాజయ్య అన్నారు. ఆదివారం తెలంగాణ విశ్వవిద్యాలయంలో బాలగేయ సాహిత్యంపై పరిశోధన చేస్తున్న సిద్దిపేటకు చెందిన బాల సాహిత్య రచయిత సతీష్‌ను కలిసి మాట్లాడారు. బాల సాహిత్యానికి సిద్దిపేట జిల్లా తరపున సహకారం ఉంటుందన్నారు. బడి పిల్లల చేత రచనలు చేయిస్తూ వారిలో ఉన్న ప్రతిభను బయటకు తీపించడానికి రచయితల కృషి చేయాలన్నారు.

Similar News

News August 13, 2025

నేడు వైఎస్ జగన్ ప్రెస్‌మీట్

image

AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ ఉదయం 11గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్‌మీట్ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ ట్వీట్ చేసింది. పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉప ఎన్నికల పోలింగ్‌తో పాటు రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితుల గురించి ఆయన మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.

News August 13, 2025

పులివెందుల: 2 కేంద్రాల్లో రీపోలింగ్

image

AP: పులివెందుల ZPTC ఉప ఎన్నికల్లో భాగంగా 2 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఎస్ఈసీ ఆదేశించింది. అచ్చవెల్లి, కొత్తపల్లెలో ఇవాళ రీపోలింగ్ నిర్వహించనున్నారు. 3, 14 కేంద్రాల్లో ఉ.7 గంటల నుంచి సా.5 గంటల వరకు రీపోలింగ్ జరగనుంది. ఈ కేంద్రాల్లో 2 వేల మంది ఓటర్లు ఉన్నారు. నిన్న జరిగిన పోలింగ్‌లో అవకతవకలు జరిగాయని మాజీ సీఎం జగన్, ఎంపీ అవినాశ్ సహా వైసీపీ శ్రేణులు ఆరోపించిన విషయం తెలిసిందే.

News August 13, 2025

VKB: 72 గంటలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

భారీ వర్షాలతో రాబోవు 72 గంటల పాటు అధికారులు అప్రమత్తంగా ఉండి ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు. వికారాబాద్ జిల్లాలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ వాగులు, కాలువలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న చోట పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కడైనా అత్యవసర పరిస్థితులు ఉంటే కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేయాలన్నారు.