News August 10, 2025
హోరాహోరీ ఫైట్.. ఇద్దరు బాక్సర్లు మృతి

జపాన్ బాక్సింగ్ ఈవెంట్లో తీవ్ర విషాదం నెలకొంది. టోక్యో కొరాకువెన్ హాల్ పోటీల్లో ఇద్దరు యువ బాక్సర్లు గాయాలపాలై మృతిచెందారు. ఈనెల 2న షిగెటోషీ కొటారీ(28) 12 రౌండ్ల హోరాహోరీ ఫైట్ తర్వాత రింగ్లోనే కుప్పకూలిపోయారు. తర్వాతి రోజు మరో మ్యాచ్లో హిరోమాసా ఉరకావా(28) ఫైనల్ రౌండ్లో నాకౌట్ అయ్యారు. వీరిద్దరూ బ్రెయిన్ ఇంజూరీస్తోనే మరణించడం గమనార్హం. ఈ విషయాన్ని వరల్డ్ బాక్సింగ్ ఫెడరేషన్ ఇవాళ వెల్లడించింది.
Similar News
News August 13, 2025
EP34: ఈ 5 లక్షణాలు వదిలేస్తే మీరే విజేతలు: చాణక్య నీతి

ఎలాంటి వ్యక్తి జీవితంలో విజయం సాధిస్తాడో చాణక్య నీతి వివరించింది. ఈ 5 లక్షణాలను వదులుకుంటే కచ్చితంగా విజయం వరిస్తుందని పేర్కొంది.
*అందరినీ సంతృప్తి పరచాలి అనుకోవడం
*అనవసరంగా ఎక్కువగా ఆలోచించడం
*నిన్ను నువ్వే కించ పరుచుకోవడం
*మార్పునకు భయపడటం
*గతంలోనే జీవించడం <<-se>>#Chanakyaneeti<<>>
News August 13, 2025
ఈ జిల్లాల్లో దంచికొడుతున్న భారీ వర్షం

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం దంచికొడుతోంది. ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, యాదాద్రి, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. కొన్నిగంటల్లో సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట్, హన్మకొండ, వరంగల్, ములుగు, నల్గొండ, నాగర్కర్నూల్, సూర్యాపేటలో వర్షం కురుస్తుందని వాతావరణ నిపుణులు తెలిపారు. HYDలోనూ పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి నుంచే వర్షం కురుస్తోంది.
News August 13, 2025
నేడు వైఎస్ జగన్ ప్రెస్మీట్

AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ ఉదయం 11గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్మీట్ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ ట్వీట్ చేసింది. పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉప ఎన్నికల పోలింగ్తో పాటు రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితుల గురించి ఆయన మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.