News August 10, 2025

RKP: 24 గంటల్లో చోరీ కేసు ఛేదన

image

రామకృష్ణాపూర్‌ పోలీస్ స్టేషన్ పరిధి పద్మావతి కాలనీలో రాజయ్య అనే సింగరేణి కార్మికుడి ఇంట్లో శుక్రవారం రాత్రి జరిగిన చోరీ కేసును 24 గంటల్లో పోలీసులు చేధించారు. బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ పర్యవేక్షణలో మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి, ఎస్ఐలు రాజశేఖర్, రాజశేఖర్, మధుసూదన్, లలిత సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితుడు జాడి సురేశ్‌ను అరెస్ట్ చేశారు. చోరీ సొత్తు 13 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.

Similar News

News August 13, 2025

రూ. 56 లక్షల ఆస్తులు అటాచ్ చేశాం: SP

image

ఎస్.కోట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల నమోదైన గంజాయి కేసులు అరెస్ట్ అయిన ఒడిశా వాసి నగేశ్‌కు చెందిన ఆస్తులను అటాచ్ చేశామని ఎస్పీ వకుల్ జిందల్ బుధవారం తెలిపారు. గంజాయి వ్యాపారంతో సంపాదించిన స్థిర, చరాస్తులను గుర్తించామని, రూ.56 లక్షల విలువైన ఆస్తులను అటాచ్ చేశామన్నారు. ఫ్రీజ్ చేసిన ఆస్తులు కోల్‌కత్తా అథారిటీ పరిధిలో ఉన్నాయని, ఎవరు కొనుగోలు చేసినా చెల్లవన్నారు.

News August 13, 2025

కాసిపేట: అప్పుల బాధకు లారీ డ్రైవర్ ఆత్మహత్య

image

కాసిపేట మండలం సోమగూడెంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన లారీ డ్రైవర్ MD.రంజాన్ అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడని SI ఆంజనేయులు తెలిపారు. లారీ నడుపుకొని కుటుంబాన్ని పోషిస్తున్న రంజాన్ కొత్త లారీ కొని అప్పుల పాలయ్యాడు. ఈనెల 12న శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో లారీలో ప్రమాదం జరిగింది. కుటుంబీకులతో చెప్పి బాధపడుతూ మానసికంగా కుంగిపోయి ఉదయం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

News August 13, 2025

శ్రీలంక కాలనీ❎.. కొలను✅

image

జన్నారం మండలంలోని శ్రీలంక కాలనీ కురుస్తున్న భారీ వర్షాలకు జలమయమైంది. కాలనీలో రోడ్డుకిరువైపులా మురుగునీటి కాలువలు లేకపోవడంతో నీరంతా రోడ్డుపైకి చేరి, నడవడానికి వీలు లేకుండా తయారైంది. కాలనీవాసులు ఇళ్లలోనుంచి బయటికి రావడానికి ఇబ్బంది పడుతున్నారు. మురుగునీటి కాలువలు ఏర్పాటు చేయాలని పంచాయతీ అధికారులను కాలనీవాసులు కోరుతున్నారు.