News August 10, 2025
నిబంధనలను కఠినంగా అమలు చేయాలి: మంత్రి

ఏపీ మెడికల్ కౌన్సిల్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తేనే నకిలీ వైద్యులను నిరోధించవచ్చని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. ఆదివారం పెదఅమిరంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి రిజిస్ట్రేషన్, రెన్యువల్ కేంద్రాన్ని కేంద్ర మంత్రి సందర్శించారు. రిజిస్ట్రేషన్, రెన్యువల్లు సక్రమంగా లేకపోతే నకిలీ వైద్యులు పెరిగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పాల్గొన్నారు.
Similar News
News September 9, 2025
నరసాపురం వరకు వందేభారత్ రైలు పొడిగింపునకు లేఖ

వందే భరత్ రైలు సర్వీస్ను చెన్నై – విజయవాడ నుంచి భీమవరం మీదుగా నరసాపురం వరకు పొడిగించాలని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు కోరారు. ఈ మేరకు రైల్వే కమిటీ ఛైర్మన్ అనకాపల్లి ఎంపీ CM రమేష్కు లేఖ రాసినట్లు ఆయన మంగళవారం తెలిపారు. ఈ సర్వీసు పొడిగింపు వల్ల రవాణ వేగం పెరుగుతుందని, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులకు ఎంతో ఉపయోగ పడుతుందని లేఖలో రాసినట్లు తెలిపారు.
News September 9, 2025
ఆలయంలో అగ్నిప్రమాదంపై ఎస్పీ విచారణ

మొగల్తూరులోని శ్రీ నడివీధి ముత్యాలమ్మ ఆలయ దహనానికి గల కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మంగళవారం తెలిపారు. ఈ కేసు విచారణలో భాగంగా నేర పరిశోధనలో నిపుణులైన FSL బృందం, డాగ్ స్క్వాడ్, అగ్నిమాపక భద్రతా బృందాలు సంఘటనా స్థలాన్ని పూర్తిగా పరిశీలిస్తున్నాయన్నారు. తనిఖీల అనంతరం వివరాలు వెల్లడిస్తామన్నారు.
News September 9, 2025
పదవి వద్దంటూ చంద్రబాబుకి అంగర లేఖ

రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మెహనరావును నియమిస్తూ ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలో మంగళవారం సీఎం చంద్రబాబుకు రామ్మెహనరావు లేఖ రాశారు. సుదీర్ఘకాలం నుంచి పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తూ ఎన్నో పదవులు చేసిన తాను కార్పొరేషన్ డైరెక్టర్ పదవి తీసుకోవడానికి సుముఖంగా లేనని, తన ఊపిరి ఉన్నంత వరకు చంద్రబాబు, లోకేశ్ల నాయకత్వంలో పనిచేస్తానని పేర్కొన్నారు.