News August 11, 2025
వైసీపీ నేత చెవిరెడ్డి బెయిల్ పిటిషన్పై రేపు జరగనున్న వాదనలు

లిక్కర్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేత, మాజీ MLA చెవిరెడ్డి భాస్కరరెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై సోమవారం వాదనలు జరగనున్నాయి. విజయవాడ ACB కోర్టులో ఈ పిటిషన్పై న్యాయాధికారి రేపు విచారించనున్నారు. అటు ఇదే కేసులో గుంటూరు జైలులో రిమాండ్లో ఉన్న నవీన్ కృష్ణ, కుమార్ యాదవ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై సైతం రేపు వాదనలు జరగనున్నట్లు సమాచారం వెలువడింది.
Similar News
News August 14, 2025
పెద్దపల్లి: ‘విద్యార్థులకు అవగాహన కల్పించాలి’

జిల్లాలో ఉన్న ప్రాంతీయ టాస్క్ సెంటర్ ద్వారా అందించే కోర్సులపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. బుధవారం కలెక్టరేట్లో యువతకు ఉపాధి కల్పనపై డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ లతో సమీక్ష నిర్వహించారు. డిగ్రీ, ఇంజనీరింగ్ ముగిసిన విద్యార్దులు టాస్క్ కోర్సులలో నమోదు చేసుకోవాలన్నారు. టామ్ కామ్ ద్వారా విదేశాలలో ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చు కోవాలని సూచించారు.
News August 14, 2025
KNR: అందరూ భాగస్వాములు కావాలి: సీపీ

‘నషా ముక్త్ భారత్ అభియాన్’ 5వ వార్షికోత్సవం సందర్భంగా కమిషనరేట్ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా KNR సీపీ గౌష్ ఆలం అధికారులతో కలిసి మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రతిజ్ఞ చేశారు. సీపీ మాట్లాడుతూ.. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని అన్నారు.
News August 14, 2025
సిరిసిల్ల: ’పర్ష రాములకు రాజనర్సు స్మారక సాహితీ పురస్కారం’

బాల సాహిత్యంలో వాసర వేణి పర్ష రాములకు సిలుముల రాజనర్సు 2025 స్మాల్క్ సాహితీ పురస్కారం వరించింది. ఈ పురస్కారాన్ని సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో MLA కేటీఆర్ చేతుల మీదుగా పర్ష రాములు అందుకున్నారు. ఈ సందర్భంగా పురస్కార కమిటీ అధ్యక్షుడు జయవర్ధన్ మాట్లాడుతూ.. పర్షరాములు బాల్యం నుండే వ్యవసాయ కూలీగా, సిరిసిల్లలో చేనేత కార్మికునిగా కూడా పని చేశారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో సైతం తన వంతు కృషి చేశారన్నారు.