News August 11, 2025
NZSR: నవోదయలో ప్రవేశాలకు గడువు పెంపు

నిజాంసాగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో ఈ విద్యా సంవత్సరానికి 11వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి గడువు నిన్నటితో ముగిసింది. అయితే ఈ గడువు ఈ నెల 20 వరకు పొడిగించినట్లు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సీతారాం బాబు పేర్కొన్నారు. 10వ తరగతిలో 60% మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఉమ్మడి NZB జిల్లా విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -SHARE IT
Similar News
News April 17, 2026
సెల్ఫ్ ఎన్యూమరేషన్ విధానమిదే!

APలో జనగణన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రారంభమైంది. ప్రజలు se.census.gov.in పోర్టల్లో ఇంటిపెద్ద పేరు, మొబైల్ నంబర్, OTPతో లాగిన్ అయి జిల్లా, పిన్ కోడ్, గ్రామం/ పట్టణం వివరాలివ్వండి. మ్యాప్లో ఇంటి లొకేషన్ గుర్తించి, అడిగిన ప్రశ్నలన్నీ పూర్తి చేయాలి. ‘Final Submit’ చేయగానే Hతో మొదలయ్యే 11 అంకెల SE ID వస్తుంది. గణన సిబ్బంది ఇంటికి వచ్చినప్పుడు ఈ ఐడీని చూపిస్తే సరిపోతుంది. ఈనెల 30 వరకూ చేయవచ్చు.
News April 17, 2026
రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: కలెక్టర్

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ప్రగతి ప్రణాళికలో భాగంగా ఖమ్మం RTO కార్యాలయంలో నిర్వహించిన “అరైవ్ అలైవ్” కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రమాద బాధితులను గోల్డెన్ అవర్లో ఆసుపత్రికి తరలించిన వారికి రాహ-వీర్ పథకం క్రింద రూ.25 వేలు ప్రోత్సాహకంగా అందజేస్తామని చెప్పారు. సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించడం మన రక్షణ కోసమేనన్నారు.
News April 17, 2026
సూర్యాపేటలో ఉమ్మడి జిల్లా చెస్ పోటీలు

ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి చెస్ ఎంపిక పోటీలు ఏప్రిల్ 19న సూర్యాపేట టీటీడీ కళ్యాణ మండపంలో జరగనున్నాయి. అండర్ 7, 11, 19 విభాగాల్లో బాలురు, బాలికలకు ఈ పోటీలు నిర్వహిస్తారు. ఎఫ్ఐడీఈ (FIDE) నిబంధనల ప్రకారం ఉదయం 10 గంటలకు టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. ఆసక్తి ఉన్న క్రీడాకారులు వివరాల కోసం 9394753343 నంబర్లో సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.


