News March 31, 2024

బెల్లంపల్లి: 14 మంది విద్యార్థులకు ప్రీమియర్ COEలో సీట్లు

image

బెల్లంపల్లి COE విద్యార్థులు 14 మంది ప్రతిష్ఠాత్మకమైన COEలో సీట్లు సాధించినట్లు ప్రిన్సిపల్ సైదులు తెలిపారు. ప్రీమియర్(స్టేట్) COEలైన గౌలిదొడ్డి, చిలుకూరు, షేక్‌పేట్, అల్గనూర్, ఇబ్రహీం పట్నం COEల్లో 14మంది విద్యార్థులు సీట్లు సాధించడం చాలా ఆనందంగా ఉందన్నారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో మిగిలిన COEల్లో మరిన్ని సీట్లు సాధిస్తామన్నారు.

Similar News

News February 16, 2026

ఆదిలాబాద్: రూ.70 తగ్గిన పత్తి ధర

image

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో సోమవారం సీసీఐ పత్తి ధర క్వింటా రూ.8,010గా, ప్రైవేట్ పత్తి ధర రూ.7,050గా నిర్ణయించారు. గత వారం ధరతో పోలిస్తే సోమవారం సీసీఐ ధరలో ఎలాంటి మార్పు లేదు. ప్రైవేట్ ధర రూ.70 తగ్గినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలియజేశారు.

News February 16, 2026

ఆదిలాబాద్‌ పురపీఠంపై ‘పొత్తు’ పొడుపు!

image

ఆదిలాబాద్‌ మున్సిపల్ పీఠం దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెట్టాయి. స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో స్వతంత్రులు కీలకంగా మారారు. ఈ క్రమంలో అధికారం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు చేతులు కలిపేందుకు సిద్ధమవుతుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. స్వతంత్రుల మద్దతు కోసం పార్టీలు ప్రలోభాలకు గురిచేస్తున్నాయని, విలువల కంటే పీఠమే ముఖ్యమైందని స్థానికులు విమర్శిస్తున్నారు.

News February 15, 2026

బోథ్: బంతి కోసం వెళ్లి బాలుడి మృతి

image

బోథ్ మండలంలో విషాదం నెలకొంది. కరత్వాడ గ్రామానికి చెందిన షేక్ ఇమ్రాన్(12) ఆదివారం తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతున్న క్రమంలో బంతి పక్కన గల కాలువలో పడింది. బంతి కోసం వెళ్లిన షేక్ ఇమ్రాన్ ప్రమాదవశాత్తు కాలువలో పడి మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ పురుషోత్తం తెలిపారు.