News August 11, 2025
HYD: ఎదుగుదలను చూసి ఓర్వలేక చంపేశారు!

మియాపూర్ PS పరిధిలో శ్రీనివాస్ హత్యకు గురైన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నాడనే అసూయతో వనపర్తికి చెందిన శ్రీనును సోహెల్ మరో ముగ్గురితో కలిసి కత్తితో పొడిచాడు. రక్తపు మడుగులో ఉన్న బాధితుడిని నిందితుల్లో ఒకరు సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లి, పరారయ్యాడు. చికిత్స పొందుతూ శ్రీనివాస్ మృతి చెందాడు. ఎదుగుదలను చూసి ఓర్వలేక చంపేయడం ఏంటని కుటుంబీకులు కన్నీరు పెట్టుకున్నారు.
Similar News
News April 15, 2026
నల్గొండ: వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

హాలియాలో పోలీసులు వ్యభిచార ముఠా గుట్టురట్టు చేశారు. ఒక నివాస గృహంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారంతో మంగళవారం మెరుపు దాడి నిర్వహించారు. ఈ సోదాల్లో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడిని అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకులపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఈ వ్యవహారంలో ఇంకా ఎవరి పాత్ర ఉందనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.
News April 15, 2026
నల్గొండ: వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

హాలియాలో పోలీసులు వ్యభిచార ముఠా గుట్టురట్టు చేశారు. ఒక నివాస గృహంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారంతో మంగళవారం మెరుపు దాడి నిర్వహించారు. ఈ సోదాల్లో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడిని అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకులపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఈ వ్యవహారంలో ఇంకా ఎవరి పాత్ర ఉందనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.
News April 15, 2026
విమాన వేంకటేశ్వర స్వామి ఎక్కడ ఉంటారు?

విమాన వేంకటేశ్వర స్వామి వారు శ్రీవారి ఆలయంలోని ఆనంద నిలయ గోపురం దక్షిణ భాగంలో దర్శనమిస్తారు. ఈ మూర్తి ఆలయ మూలవిరాట్టులాగే ఉంటుంది. శ్రీవారి భక్తుడైన తొండమాన్ చక్రవర్తి దీనిని ఏర్పాటు చేశారని వేంకటాచల మాహాత్మ్యం చెబుతోంది. భక్తులు సులభంగా దర్శించుకునేందుకు వీలుగా గోపురం వద్ద వెండి మకర తోరణం ఏర్పాటు చేశారు. అలాగే బాణం గుర్తు కూడా ఉంటుంది. ఈ స్వామివారిని దర్శించడం విశేషంగా భావిస్తారు.


