News August 11, 2025

చల్లసముద్రంలో కొత్త యూరియా విక్రయ కేంద్రం ప్రారంభం

image

ఇల్లందు మండలం చల్ల సముద్రం గ్రామంలో నూతన యూరియా విక్రయ కేంద్రాన్ని ఎమ్మెల్యే కోరం కనకయ్య సోమవారం ప్రారంభించారు. రైతుల రద్దీని తగ్గించడానికి మండలంలో ఇది మూడో కేంద్రమని ఆయన తెలిపారు. రైతులు యూరియా వినియోగాన్ని తగ్గించి, సేంద్రీయ వ్యవసాయంపై దృష్టి సారించాలని సూచించారు. రైతులందరికీ సరిపడా యూరియా అందుబాటులో ఉందని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు.

Similar News

News April 16, 2026

నిర్మల్: వేసవి సెలవులు.. జాగ్రత్తగా విద్యా పరికరాలు

image

ఈ నెల 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. కంప్యూటర్లు, రికార్డులు, ల్యాబ్ పరికరాలను భద్రపరచాలని హెడ్ మాస్టర్లకు సూచించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఆకతాయిల వల్ల నష్టం కలగకుండా నిఘా ఉంచాలని పేర్కొంది. పాఠశాల ఆస్తిని మన సంపదగా భావించి కాపాడాలని స్పష్టం చేసింది.

News April 16, 2026

ఏప్రిల్ 22న జిల్లాస్థాయి ‘చదువుల పండుగ 2.0’: డీఈవో

image

నారాయణపేట జిల్లాలో ఏప్రిల్ 22న జిల్లా స్థాయి ‘చదువుల పండుగ 2.0’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు డీఈవో గోవిందరాజులు తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరగనుంది. ​3 నుంచి 7వ తరగతి విద్యార్థులకు తెలుగు, ఇంగ్లిష్, గణితం, క్విజ్, YOC విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఏప్రిల్ 21 నాటికి మండల స్థాయి పోటీలు పూర్తి చేసి, విజేతలను జిల్లా స్థాయికి పంపుతారు.

News April 16, 2026

విధిని వెక్కిరించిన సిక్కోలు విద్యార్థి

image

పలాసకు చెందిన సకల భక్తుల వంశీకి పుట్టుకతోనే చేతులు, కాళ్లు సహకరించని పరిస్థితి. అయినప్పటికీ ఇంటర్మీడియట్ ఫలితాల్లో 1000 మార్కులకు 972 మార్కులు సాధించారు. తండ్రి లక్ష్మణరావు చిరు వ్యాపారి, తల్లి పార్వతి గృహిణి. స్థానికంగా ఓ ప్రైవేట్ కళాశాలలో ఎంపీసీ గ్రూపులో చదివించారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, టీచర్స్ , స్నేహితుల సహకారం మరువలేనిదని వంశీ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.