News August 11, 2025
అనకాపల్లి పీ.జీ.ఆర్.ఎస్.కు 291 అర్జీలు

అనకాపల్లి కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు 291 అర్జీలను అధికారులకు సమర్పించారు. కలెక్టర్ విజయకృష్ణన్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వాటిని పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులకు పంపించి సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ జాహ్నవి, జిల్లా రెవెన్యూ అధికారి సత్యనారాయణరావు పాల్గొన్నారు.
Similar News
News April 18, 2026
భూగర్భ జలాల పెంచడమే లక్ష్యం: కలెక్టర్

భూగర్భ జలాలు పెంచడమే లక్ష్యమని కలెక్టర్ సిరి పేర్కొన్నారు. శనివారం కోడుమూరు మండలం ఆమడగుంట్లలో నీటి భద్రత, జల ధార జల హారతి కార్యక్రమం నిర్వహించారు. వంకలను, వాగులను, చెరువులను గుర్తించి వాటికి మరమ్మత్ పనులు చేపట్టి నీరు నింపుతామన్నారు. తద్వారా భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందన్నారు. నీటిని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో పీడీ నరసింహారెడ్డి పాల్గొన్నారు.
News April 18, 2026
జగిత్యాల జిల్లాలో రేపు ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్ష

తెలంగాణ ఆదర్శ పాఠశాలల ప్రవేశ పరీక్ష (TSMS) 2026-27ను జిల్లాలో రేపు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి తెలిపారు. 7, 8, 9, 10 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. మొత్తం 2,972 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. విద్యార్థులు సమయానికి కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
News April 18, 2026
అప్పుడు మహిళలే బిల్లును వ్యతిరేకించారు.. ఎందుకంటే?

మహిళా రిజర్వేషన్లు బిల్లును ఒకప్పుడు మహిళలే వ్యతిరేకించారని తెలుసా? రాజ్యాంగ సభలో భాగమైన రేణుకా రే సహా పలువురు మహిళలు రిజర్వేషన్ వద్దనే వాదనను బలంగా వినిపించారు. అలా చేస్తే మహిళా ప్రాతినిధ్యం కొన్ని సీట్లకే పరిమితం అవుతుందని, జనరల్ సీట్లలో ప్రాధాన్యం తగ్గుతుందని 1947 జులై 18న జరిగిన సభలో పేర్కొన్నారు. కానీ ఆ తర్వాత కాలంలో నెలకొన్న పరిస్థితులు వారి అంచనాలకు భిన్నంగా మారాయి.


