News August 11, 2025
నాంపల్లి: హజ్ యాత్రకు వేలల్లో దరఖాస్తులు

వచ్చే ఏడాది హజ్ యాత్రకు వెళ్లేందుకు 11,414 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలంగాణ హజ్ కమిటీ తెలిపింది. హజ్ యాత్రకు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 7న గడువు ముగిసింది. 2, 3 రోజుల్లో డ్రా తీసి యాత్రికులను ఎంపిక చేయనున్నారు. యాత్రకు ఎంపికైన వారు మొదటి విడతలో రూ.1.5 లక్షలు చెల్లించేందుకు సిద్ధంగా ఉండాలని కమిటీ పేర్కొంది.
Similar News
News September 14, 2025
HYD: పొలిటికల్ డ్రామా.. ఓవర్ టూ అసెంబ్లీ

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి మారిన MLAల భవిత నేడు కీలక మలుపు తీసుకోనుంది. ‘పార్టీ మార్పు’పై ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణపై బీఆర్ఎస్ నాయకులు ఈ రోజు అసెంబ్లీలో స్పీకర్కు తమ అభిప్రాయం చెప్పబోతున్నారు. మధ్యాహ్నం అసెంబ్లీ కార్యదర్శితో BRS నాయకులు సమావేశం కానున్నారు. వారిచ్చే రియాక్షన్ను బట్టి స్పీకర్ చర్యలు తీసుకోబోతున్నారు. ఈ తాజా రాజకీయ పరిణామాలతో నగరంలో పోలిటికల్ హీట్ మొదలైంది.
News September 14, 2025
JNTUలో పార్ట్ టైం PhD కోసం ప్రవేశ పరీక్షలు

జేఎన్టీయూ యూనివర్సిటీలో పార్ట్ టైం PhD కోసం పరీక్షలు జరుగుతున్నాయి. నేడు ఉదయం కంప్యూటర్ సైన్స్ ఎగ్జామ్ జరగనుంది. మధ్యాహ్నం మెకానికల్ తోపాటు EEE విభాగంలోని కోర్సులకు పరీక్ష నిర్వహించనున్నట్లు ఎగ్జామినేషన్ డైరెక్టర్ కృష్ణమోహన్రావు వెల్లడించారు. పరీక్షల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.
News September 14, 2025
HYD: కృతిక ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండీ అరెస్ట్

ప్లాట్ల అమ్మకం ముసుగులో చీటింగ్ చేసి పరారీలో ఉన్న కృతిక ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండీని LBనగర్ SOT బృందం, LBనగర్ పోలీసులు అరెస్టు చేశారు. వివిధ ప్రదేశాల్లో ప్లాట్లను అమ్మే ముసుగులో భారీగా డబ్బు కాజేసి చాలా మందిని మోసం చేసిన ఆదిభట్లకు చెందిన శ్రీకాంత్(35)ను జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. అతడిపై సరూర్నగర్, వనస్థలిపురం, మేడిపల్లిలో కేసులు ఉన్నాయని సీఐ వినోద్ కుమార్ తెలిపారు.