News August 11, 2025
లిక్కర్ స్కాం కేసు.. సిట్ రెండో ఛార్జ్షీట్

AP: మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏసీబీ కోర్టులో సిట్ అదనపు ఛార్జ్షీట్ దాఖలు చేసింది. 200 పేజీలతో దీన్ని రూపొందించి, సమర్పించింది. కుంభకోణంలో ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పల పాత్రలపై ఆధారాలను ఇందులో పొందుపరిచినట్లు తెలుస్తోంది. మద్యం ముడుపులు ఎవరి నుంచి తీసుకున్నారు? ఎవరికి అప్పగించారు? అనే అంశాలను సిట్ పేర్కొన్నట్లు సమాచారం.
Similar News
News August 12, 2025
ALERT: రాష్ట్రంలో 3 రోజులు భారీ వర్షాలు

AP: అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
News August 12, 2025
మాజీ ఎమ్మెల్యేలు కన్నుమూత

AP: అన్నమయ్య(D) రాజంపేట మాజీ MLA కసిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి(78) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన HYDలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1989లో రాజంపేట నుంచి INC MLAగా గెలిచారు. 1985, 1994, 2009లో పోటీ చేసి ఓడిపోయారు. అటు తిరుపతి(D) శ్రీకాళహస్తి మాజీ MLA తాటిపర్తి చెంచురెడ్డి కూడా తిరుపతిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 1988 ఉపఎన్నికలో INC తరఫున MLAగా గెలిచారు.
News August 12, 2025
ట్రంప్ అండతో పాక్ అధ్యక్షుడిగా ఆసిమ్ మునీర్?

భారత్కు దూరమవుతున్న ట్రంప్ పాక్ను అక్కున చేర్చుకుంటున్నారు. ఈక్రమంలోనే ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ను ఆ దేశ అధ్యక్షుడిగా చూడాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. 2 నెలల్లో మునీర్ 2 సార్లు US వెళ్లారు. పాక్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి అధ్యక్ష పదవి దక్కించుకునేలా ట్రంప్తో కలిసి ప్లాన్ వేస్తున్నట్లు భారత విదేశాంగ వర్గాలు భావిస్తున్నాయి. కాగా ఇప్పటికే US గడ్డపై నుంచి మునీర్ భారత్పై విషం కక్కుతున్నారు.