News August 11, 2025
సిద్దిపేట: ‘ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలి’

ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను కలెక్టర్ కె.హేమావతి ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం ద్వారా జిల్లాలోని నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వారి సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ప్రజావాణికి వివిధ సమస్యలపై 131 అర్జీలు వచ్చాయని అధికారులు తెలిపారు.
Similar News
News April 19, 2026
VKB: ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి తప్పిన ప్రమాదం

కుల్కచర్లలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్రోన్ పిచికారీ ప్రదర్శనలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి ప్రమాదం తప్పింది. వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయన.. డ్రోన్ పంపిణీని ప్రారంభిస్తుండగా అది అదుపుతప్పి ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన సిబ్బంది ఆయన్ను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
News April 19, 2026
గిరిజన గురుకుల ప్రవేశ పరీక్షలు ప్రశాంతం

ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఆదివారం గిరిజన గురుకుల CoE ప్రవేశ పరీక్షలు విజయవంతంగా ముగిశాయి. ఐదు కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షలకు 88.59 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు ఆర్సీఓ అరుణకుమారి తెలిపారు. మొత్తం 1,692 మందికి గాను 1,468 మంది హాజరయ్యారని, పరీక్షలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా పారదర్శకంగా జరిగాయని పేర్కొన్నారు. భద్రాచలంలోని పలు కేంద్రాలను ఆమె స్వయంగా తనిఖీ చేశారు.
News April 19, 2026
ఛేజింగ్లో చేతులెత్తేస్తున్న ఛాంపియన్లు

ఐదుసార్లు IPL ఛాంపియన్లు అయిన MI, CSK ఛేజింగ్లో చేతులెత్తేస్తున్నాయి. 2024 నుంచి ఇప్పటివరకు ముంబై 19 మ్యాచుల్లో 12 ఓడిపోగా, చెన్నై 16 మ్యాచుల్లో 10 ఓడిపోయి ఛేజింగ్లో అత్యధిక మ్యాచ్లు ఓడిన జట్లుగా నిలిచాయి. ఈ ఇరు జట్లు ఛేజింగ్ను మెరుగుపర్చుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక CSK కెప్టెన్ రుతురాజ్ ఛేజింగ్ రికార్డ్ కూడా వీక్గా ఉంది. 2022 నుంచి 23 మ్యాచ్ల్లో రుతురాజ్ కేవలం 518 రన్స్ చేశారు.


