News March 31, 2024

మార్కాపురాన్ని జిల్లా కేంద్రం చేస్తా: చంద్రబాబు

image

మార్కాపురాన్ని జిల్లా కేంద్రంగా చేస్తానని ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చంద్రబాబు హామీ ఇచ్చారు. మార్కాపురంలో ప్రజాగళం సభలో ఆయన మాట్లాడుతూ.. మార్కాపురానికి నీళ్లు, నియామకాలతో పాటు మార్కాపురాన్ని జిల్లా కేంద్రంగా చేస్తానని చెప్పుకొచ్చారు. అలాగే సంపద సృష్టిస్తూ.. సంక్షేమాన్ని ఇస్తానని తెలిపారు. ‘సంపద సృష్టించే ముఖ్యమంత్రి కావాలా.. గంజాయి తెచ్చే ముఖ్యమంత్రి కావాలా’ అని ప్రజలను అడిగారు.

Similar News

News March 16, 2026

పొట్టి శ్రీరాములుకు నివాళులర్పించిన SP

image

అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి సోమవారం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం సాధన కోసం పొట్టి శ్రీరాములు 58 రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను అర్పించారని గుర్తు చేశారు. ఆయన త్యాగం ఫలితంగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం అవతరించిందన్నారు.

News March 16, 2026

మార్కాపురం కలెక్టరేట్‌లో గ్రీవెన్స్ డే: జేసీ

image

మార్కాపురం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో రాసి అధికారులకు సమర్పించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అర్జీలపై అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకుంటారని భరోసా ఇచ్చారు.

News March 16, 2026

మార్కాపురం కలెక్టరేట్‌లో గ్రీవెన్స్ డే: జేసీ

image

మార్కాపురం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో రాసి అధికారులకు సమర్పించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అర్జీలపై అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకుంటారని భరోసా ఇచ్చారు.