News August 11, 2025

క్రైం న్యూస్ రౌండప్

image

* హైదరాబాద్ ORRపై వాహనం ఢీకొని ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు మృతి. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్న పోలీసులు
* విశాఖ బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం. బ్రేకులు ఫెయిలై ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకెళ్లడంతో మహిళ దుర్మరణం, మరొకరికి తీవ్రగాయాలు
* వైజాగ్ స్టీల్‌ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం. కార్మికుడి మృతి

Similar News

News August 12, 2025

ఇన్‌కమ్ టాక్స్ బిల్లు-2025లో ఏం మారాయి?

image

ఇవాళ ఆమోదం <<17375107>>పొందిన<<>> ఇన్‌కమ్ టాక్స్ బిల్లు-2025లో కొన్ని పదాలను మార్చారు. పాత బిల్లులో ‘క్రితం సంవత్సరం, అసెస్‌మెంట్ ఇయర్’ అనే పదాల స్థానంలో ‘టాక్స్ ఇయర్’ అని రీప్లేస్ చేశారు. కొత్త పన్నులు, శ్లాబులు, ఐటీఆర్ ఫైలింగ్ గడువు తేదీలు, రేట్లనేమీ మార్చలేదు. స్టాండర్డ్ డిడక్షన్, గ్రాడ్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ తదితర సెక్షన్లు, నిబంధనలను ఒక పట్టిక రూపంలోకి తీసుకొచ్చారు. బిల్లు కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News August 12, 2025

APLలో ఇవాళ్టి మ్యాచులు ఇవే

image

AP: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్4 సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. నిన్న మొదటి మ్యాచ్‌లో తుంగభద్ర వారియర్స్‌పై అమరావతి రాయల్స్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. రెండో మ్యాచ్‌లో సింహాద్రి వైజాగ్ లైన్స్‌పై కాకినాడ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇవాళ మధ్యాహ్నం 1.30 గం.కు భీమవరం బుల్స్, అమరావతి రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. సా.6.30గం.కు విజయవాడ సన్ షైనర్స్, సింహాద్రి వైజాగ్ లైన్స్ తలపడనున్నాయి.

News August 12, 2025

భారత్ సరిహద్దు సమీపంలో చైనా రైల్వే లైన్!

image

ఇండియా సరిహద్దు సమీపంలో చైనా రైల్వేలైన్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులో కొంత భాగం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్(LAC) సమీపంలో ఉంటుందని చెప్తున్నారు. టిబెట్‌ను షిన్‌జాంగ్ ప్రావిన్సుతో కలపనున్నారు. రూ.1.15 లక్షల కోట్ల క్యాపిటల్‌తో ‘ది షిన్‌జాంగ్-టిబెట్ రైల్వే కంపెనీ’ని రిజిస్టర్ చేశారని చైనా మీడియాలో వార్తలొచ్చాయి. LAC సమీపంలో కాబట్టి రక్షణపరంగా భారత్ ఆందోళన చెందాల్సిన అవసరముంది.