News August 12, 2025
మంత్రి కొల్లు రవీంద్రను కలిసిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్

విజయవాడ క్యాంపు కార్యాలయంలో మంత్రి కొల్లు రవీంద్రను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ సోమవారం కలిశారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కేసుల పురోగతిపై నివేదికను సమర్పించి, రాష్ట్ర సరిహద్దుల్లో మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు చేపట్టిన చర్యలను వివరించారు. ఈ సందర్భంగా భవిష్యత్ వ్యూహాలపై కూడా చర్చించారు.
Similar News
News September 7, 2025
మచిలీపట్నంలో చికెన్ ధర ఎంతంటే?

మచిలీపట్నంలో ఆదివారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. స్కిన్ లెస్ కేజీ రూ.220, స్కిన్తో అయితే రూ.200కి లభిస్తోంది. కొన్ని చోట్ల డిమాండ్ను బట్టి ధరల్లో స్వల్ప మార్పులున్నాయి. మటన్ ధర యథావిధిగా రూ.800 -1000 మధ్య కొనసాగుతుంది. మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News September 6, 2025
కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

☞ కృష్ణా: ఈనెల 10న షూటింగ్ బాల్ జట్లు ఎంపిక
☞ ఆత్కూరులో యువతతో ముచ్చటించిన వెంకయ్య నాయుడు
☞ రైతుల్లో నమ్మకం పెంచేందుకు కృషి చేయండి: కలెక్టర్
☞ జాతీయ అవార్డులు అందుకున్న కృష్ణాజిల్లా ఉపాధ్యాయులు
☞ కృష్ణా: తగ్గుముఖం పట్టిన వరద
☞ చల్లపల్లి: నదిలో మునిగి యువకుడి మృతి
News September 6, 2025
కృష్ణా: ఈనెల 10న షూటింగ్ బాల్ జట్ల ఎంపికలు

కృష్ణాజిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ బాల బాలికల జిల్లా జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సంఘం అధ్యక్షులు రాజశేఖర్ తెలిపారు. ఈ ఎంపికలు ఈనెల 10న మధ్యాహ్నం 2 గంటలకు గుణదలలో జరుగుతాయని పేర్కొన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు తమ ఆధార్, జనన ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావచ్చన్నారు. ఎంపికైన క్రీడాకారులు నెల్లూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు.