News August 12, 2025
4 రోజులే గడువు.. దత్తత ప్రక్రియ పూర్తి చేయండి: కలెక్టర్

ఆగస్టు 15 నాటికి జిల్లాలో బంగారు కుటుంబాల దత్తత ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో మార్గదర్శకుల ఎంపికను సైతం పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News April 20, 2026
బెట్టింగ్.. ప్రకాశం జిల్లా యువకుడి అరెస్ట్

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పోలీసులు <<19692230>>బెట్టింగ్ ముఠా<<>>ను అరెస్ట్ చేశారు. ఉంగుటూరు మండలం గొల్లగూడేనికి చెందిన నరసింహాచార్యులును విచారించారు. హైదరాబాద్లోని కూకట్పల్లి అడ్డగా బెట్టింగ్ నడుపుతున్నట్లు తేలింది. ప్రకాశం జిల్లా ముండ్లమూరు(M) ఉల్లగల్లుకు చెందిన పర్వతనేని వేణుతో పాటు ఇతర జిల్లాలకు చెందిన గజ్జల రవీంద్ర రెడ్డి, పల్లెపాగ రవి, తులబంతుల తాండవ కృష్ణను అరెస్ట్ చేశారు.
News April 20, 2026
మైనర్లకు వాహనాలు ఇచ్చేవారిపై కేసులు.. జాగ్రత్త: SP

ప్రకాశం జిల్లా SP మైనర్ డ్రైవింగ్పై కఠిన హెచ్చరికలు జారీ చేశారు. 18 ఏళ్లలోపు వారికి వాహనాలు ఇవ్వడం చట్ట విరుద్ధమని, పట్టుబడితే తల్లిదండ్రులు, వాహన యజమానులపై కేసులు నమోదుచేసి జరిమానాలు, జైలు శిక్ష విధిస్తామని తెలిపారు. ట్రాఫిక్ నియమాలు తెలియక వాహనాలు నడపడం ప్రమాదాలకు దారితీస్తోందన్నారు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయరాదని SP సూచించారు.
News April 20, 2026
ప్రకాశం: పరిష్కార వేదిక సమయంలో మార్పులు

ఒంగోలులో సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే నిర్వహిస్తామని DRO ఓబులేసు ప్రకటించారు. జిల్లాలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్కు అర్జీలు సమర్పించేవారు ఈ సమయంలోనే ఇచ్చి 12.30 గంటలకల్లా తిరిగి నివాసగృహాలకు చేరుకోవాలని సూచించారు.


