News August 12, 2025
ఆగస్టు 15 నుంచి కొత్త పాస్ బుక్స్ పంపిణీ!

AP: రాజముద్రతో కొత్త పట్టాదారు పుస్తకాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఆగస్టు 15-31 వరకు తొలి విడతగా కొత్త పాస్ బుక్స్ను కొందరు రైతులకు అందిస్తారని తెలుస్తోంది. గత ప్రభుత్వం పాస్బుక్స్పై అప్పటి సీఎం జగన్ ఫొటో ముద్రించిన విషయం తెలిసిందే. వాటిని మార్చి రాజముద్రతో కొత్త పట్టాదారు పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. విడతల వారీగా 20 లక్షల మందికిపైగా ఈ కొత్త పాస్ బుక్స్ అందించనున్నారు.
Similar News
News August 12, 2025
వామన్ రావు హత్యకేసు సీబీఐకి అప్పగించాలి: సుప్రీంకోర్టు

TG: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన న్యాయవాది వామన్ రావు దంపతుల <<6352207>>హత్య<<>> కేసును సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. హత్య కేసును తిరిగి విచారణ జరపాలని, పిటిషనర్ కిషన్ రావుకు భద్రత కల్పించాలని సూచించింది. కాగా ఈ కేసును సీబీఐకి అప్పగించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది ఇప్పటికే స్పష్టం చేశారు.
News August 12, 2025
అంబానీని టార్గెట్ చేసిన పాక్ ఆర్మీ చీఫ్!

అమెరికా పర్యటన సందర్భంగా పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ భారత బిలియనీర్ ముకేశ్ అంబానీని కూడా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఇండియన్ ఆర్మీ మళ్లీ దాడి చేస్తే గుజరాత్ జామ్నగర్లోని రిలయన్స్ రిఫైనరీని పేల్చేస్తామని చెప్పినట్లు సమాచారం. ఖురాన్లోని ఓ వాక్యాన్ని ఉదహరిస్తూ అంబానీ ఫొటో చూపిస్తూ హెచ్చరించినట్లు తెలుస్తోంది. కాగా మునీర్ బెదిరింపులకు భయపడేది లేదని ఇప్పటికే భారత్ స్ట్రాంగ్ <<17370414>>కౌంటర్<<>> ఇచ్చింది.
News August 12, 2025
అలాంటి రోల్ చేయడం నచ్చలేదు: అనుపమ

‘టిల్లు స్క్వేర్’ మూవీలో నటిస్తున్న సమయంలో తాను కంఫర్ట్గా లేనని హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అన్నారు. చాలా కాలం ఆలోచించాకే ఆ సినిమా ఒప్పుకొన్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ మూవీలో లిల్లీ పాత్ర చేయడం నచ్చలేదని, 100% కాన్ఫిడెన్స్గా కూడా చేయలేదని చెప్పుకొచ్చారు. మరోవైపు ఇండస్ట్రీలో నచ్చని విషయాలు చెబితే ‘యాటిట్యూడ్’ అంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా ఆమె నటించిన ‘పరదా’ ఈ నెల 22న విడుదల కానుంది.