News August 12, 2025

రాజధాని అమరావతి జిల్లా కేంద్రంగా మారనుందా?

image

అమరావతి రాజధాని జిల్లా కేంద్రంగా మారనుందా అనే ప్రశ్న ఇప్పుడు CRDA పరిధిలో సందిస్తుంది. కొత్త జిల్లాల ఏర్పాటు, సరిహద్దులు, పేర్లు, మండలాల మార్పులు చేర్పులపై కసరత్తు జరుగుతుంది. దీనిపై ఈనెల 13వ తేదీన తొలి క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. తాడికొండ, మంగళగిరి, జగ్గయ్యపేట, నందిగామతో పాటు పల్నాడు జిల్లాలో ఉన్న పెదకూరపాడు నియోజకవర్గాన్ని కూడా అమరావతిలో కలుపుతారని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

Similar News

News April 17, 2026

మాదకద్రవ్యాలపై కఠిన చర్యలు: ఐజీ గోపీనాథ్ జట్టి

image

మాదకద్రవ్యాల నిర్మూలనపై విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి ఆధ్వర్యంలో ఐదు జిల్లాల ఎస్పీలతో శుక్రవారం సమీక్ష జరిగింది. “సంకల్పం, చైతన్యం, అభ్యుదయం 2.0” పేరుతో 100 రోజుల కార్యాచరణ చేపట్టారు. ఇప్పటివరకు రూ.11.63 కోట్ల ఆస్తులు ఫ్రీజ్ చేశమన్నారు. 72 కేసుల్లో 129 మందికి శిక్షలు పడినట్లు తెలిపారు. డ్రోన్లు, యాప్‌లతో నిఘా పెంచి, 1000 డ్రగ్ ఫ్రీ గ్రామాల లక్ష్యంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

News April 17, 2026

HYD‌లో నయా ట్రెండ్ ఇదే!

image

HYDలో నైట్‌లైఫ్ ఇప్పుడు పక్కా క్యాలెండర్ ఈవెంట్‌లా మారిపోయింది. ఐటీ కుర్రాళ్లు, స్టూడెంట్స్ వారం ముందే గెస్ట్ లిస్టులు, టేబుల్స్ బుక్ చేసుకుంటున్నారు. హైటెక్ సిటీ, గచ్చిబౌలిలో క్లబ్బింగ్ అంటే ఒక మినీ ఫెస్టివల్‌ను తలపిస్తోంది. సమయం తక్కువగా ఉండటంతో, రాత్రిపూట తిరగడం కంటే ముందే అన్నీ ప్లాన్ చేసుకోవడానికే యువత ప్రాధాన్యం ఇస్తోంది. పక్కా షెడ్యూల్‌తో ఎంజాయ్ చేయడం ఇప్పుడు ట్రెండ్.

News April 17, 2026

పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు పటిష్టమైన ఏర్పాట్లు: కలెక్టర్

image

ఈనెల 25న జరగనున్న పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు (పాలిసెట్) పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 15 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏలూరులో 9, నూజివీడులో 3, జంగారెడ్డిగూడెంలో 3 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.