News August 12, 2025
భీమవరం: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నలుగురికి జరిమానా

మద్యం సేవించి వాహనం నడిపిన నలుగురుకు భీమవరం స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ సోమవారం జరిమానా విధించారు. రూరల్ ఎస్సై వీర్రాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 8వ తేదీన కొవ్వాడ సెంటర్లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్లో నాగరాజు, సురేశ్, వెంకన్న, చిన్న మద్యం సేవించి వాహనం నడుపుతుండగా పట్టుపడ్డారరు. ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున నలుగురికి రూ.40,000 జరిమానాను మెజిస్ట్రేట్ విధించారు.
Similar News
News August 13, 2025
మహాదేవపట్నంలో చాక్లెట్ ఫ్యాక్టరీ ప్రారంభం

ఉండి మండలం మహాదేవపట్నంలో మహిళా సమైక్య సభ్యులు నెలకొల్పిన స్లో బీన్ చాక్లెట్ ఫ్యాక్టరీని డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ నాగరాణి ప్రారంభించారు. రూ.25 లక్షల వ్యయంతో స్థాపించిన ఈ ఫ్యాక్టరీకి పీఎంఎఫ్ఎంఈ పథకం కింద రూ.8.75 లక్షల సబ్సిడీ లభించింది. మహిళలు పరిశ్రమలు స్థాపించి ఆర్థికాభివృద్ధి సాధించాలని ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు సూచించారు.
News August 13, 2025
భీమవరం: సెల్ఫీ పాయింట్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్.

‘హర్ ఘర్ తిరంగా’ ప్రచారంలో భాగంగా భీమవరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ను కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించారు. అనంతరం ఆమె సెల్ఫీ దిగారు. ప్రజలు త్రివర్ణ పతాకంతో దిగిన సెల్ఫీలను ‘హర్ ఘర్ తిరంగా’ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని కలెక్టర్ కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ కార్యక్రమం రెండేళ్లలో జాతీయ ఉద్యమంగా మారిందని ఆమె కొనియాడారు.
News August 13, 2025
నేడు భీమవరంలో మాజీ సీఎం జగన్ పర్యటన

మాజీ సీఎం వైసీపీ అధినేత శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కుమార్తె వివాహ వేడుకలో ఆయన పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3.15 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి, విఎస్స్ గార్డెన్స్లో జరిగే వేడుకకు హాజరు అవుతారు. అనంతరం ఆయన తిరిగి తాడేపల్లికి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా జగన్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.