News August 12, 2025
ఇది కాంగ్రెస్ అరాచక పాలనకు నిదర్శనం: బండి సంజయ్

TG: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హౌస్ అరెస్టు కాంగ్రెస్ అరాచక పాలనకు నిదర్శనమని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైరయ్యారు. పెద్దమ్మ గుడిలో పూజలు చేస్తే తప్పేంటని, గుడిని కూల్చిన గూండాలను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఓట్ల లబ్ధికి కాంగ్రెస్ ఇలా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు త్వరలో రానున్నాయన్నారు.
Similar News
News August 12, 2025
అమరావతి పనులు వేగంగా పూర్తి చేయాలి: చంద్రబాబు

AP: రాజధాని అమరావతిలో మొత్తం రూ.81,317 కోట్ల విలువైన పనులు చేపట్టాలని CRDA ప్రతిపాదించిందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. రూ.50,552 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచినట్లు తెలిపారు. ఇందులో భవన నిర్మాణాలు, ఎల్పీఎస్ మౌలిక సదుపాయాలు, రోడ్లు, డక్ట్లు, ట్రంక్ ఇన్ఫ్రా, వరద నియంత్రణ పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. రికార్డు టైంలో ఈ నిర్మాణాలు పూర్తి చేయాలని CRDAపై సమీక్షలో సీఎం ఆదేశించారు.
News August 12, 2025
ఫాస్టాగ్ ఏడాది పాస్ అప్లై చేసుకోండిలా!

ఈనెల 15 నుంచి అందుబాటులోకి వచ్చే ఫాస్టాగ్ ఏడాది పాస్ను మొబైల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ‘Rajmarg Yatra’ యాప్ లేదా NHAI అఫీషియల్ వెబ్సైట్ను సందర్శించాలి. వాహన నంబర్/ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అవ్వాలి. ప్రస్తుత FASTag యాక్టివ్గా ఉండేలా, విండ్షీల్డ్పై అతికించి ఉండాలి. తర్వాత రూ.3,000 ఛార్జ్ ఆన్లైన్ ద్వారా చెల్లించండి. ఆ తర్వాత మీ ఏడాది పాస్ను ప్రస్తుత FASTagకి లింక్ చేయండి.
News August 12, 2025
హైదరాబాద్ మెట్రోకు నిరాశ

హైదరాబాద్ మెట్రోకు కేంద్ర క్యాబినెట్ మరోసారి మొండిచేయి చూపింది. ఇవాళ్టి సమావేశంలో బెంగళూరు, థాణె, పుణే, ఢిల్లీ, చెన్నై మెట్రో ప్రాజెక్టులకు రూ.1.09 లక్షల కోట్ల విలువైన పనులు చేపట్టేందుకు అనుమతించింది. ఇదే సమయంలో హైదరాబాద్ మెట్రో ఫేజ్-3పై ప్రకటనేమీ లేకపోవడంతో నగరవాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. HYD రోడ్లపై రద్దీ విపరీతంగా పెరిగిందని, మెట్రో నిర్మాణానికి అనుమతివ్వాలని కోరుతున్నారు.