News August 12, 2025

కామారెడ్డి: ఈతకు వెళ్లి కవలలు మృతి

image

కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కుంటలో స్నానానికి వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. తిమ్మక్ పల్లికి చెందిన కవలలు రామ్, లక్ష్మణ్ నిన్న సాయంత్రం పాఠశాల నుంచి రాగానే బయటకు వెళ్లారు. రాత్రి 10 అయినా తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు గాలించగా.. గ్రామశివారులోని కుంట ఒడ్డుపై ఇద్దరి బట్టలు కనిపించాయి. కుంటలో గాలించగా నిన్న రాత్రి ఒకటి ఇవాళ మరో మృతదేహం లభ్యమైంది.

Similar News

News April 17, 2026

దిగుమతుల్లో గోల్డ్, సిల్వర్ సరికొత్త రికార్డ్

image

2025-26లో దేశంలో బంగారం, వెండి దిగుమతుల విలువ జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే బంగారం దిగుమతి విలువ $71.98 బిలియన్లకు పెరిగింది. అయితే పరిమాణం పరంగా 4.76% తగ్గి 721.03 టన్నులకు క్షీణించింది. వెండి దిగుమతి విలువ 150% పెరిగి $12Bకు (7,344.96 టన్నులు) చేరింది. మరోవైపు 15 బ్యాంకులకు గోల్డ్, సిల్వర్ దిగుమతులపై అనుమతిని 2029 మార్చి వరకు పొడిగిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

News April 17, 2026

ఈ కారణాలవల్లే రోడ్డు ప్రమాదాలు: భద్రాద్రి ఎస్పీ

image

రహదారి ప్రమాదాల నివారణలో పోలీస్, మున్సిపల్, వైద్య, రవాణా శాఖల సమన్వయం కీలకమని భద్రాద్రి ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. దేశవ్యాప్తంగా ప్రతి రోజు సుమారు 500 మందికి పైగా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మద్యం సేవించి వాహనం నడపడం, హెల్మెట్, సీట్ బెల్ట్ వాడకపోవడం, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం వంటి కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నాయని దమ్మపేట సభలో తెలిపారు.

News April 17, 2026

సంజామల @44.8°C

image

నంద్యాల జిల్లా సంజామలలో శుక్రవారం రికార్డు స్థాయిలో 44.8°C గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు ఏపీ విపత్తుల సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. తీవ్రమైన ఎండల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. బయటకు వెళ్లేటప్పుడు వేడిగాలి చెవుల్లోకి వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేలా జాగ్రత్తలు పాటించాలని ఆయన స్పష్టం చేశారు.