News August 12, 2025
భూసేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

వనపర్తి జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. కలెక్టర్ తన ఛాంబర్లో భూసేకరణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో చేపడుతున్న ఇరిగేషన్ ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువల నిర్మాణం కోసం ఇరిగేషన్ శాఖ ద్వారా పెట్టిన భూసేకరణ ప్రతిపాదనలకు ఇప్పటి వరకు రెవెన్యూ, సర్వే అధికారులు తీసుకున్న చర్యలపై సమీక్ష చేపట్టారు.
Similar News
News April 19, 2026
రేపు రైతుభరోసా నిధులు విడుదల.. సీఎం షెడ్యూల్ ఇదే

TG: రైతుభరోసా రెండో విడత నిధులు విడుదల చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి రేపు భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. ఆలయ అభివృద్ధి పనుల భూమిపూజలో పాల్గొంటారు. అనంతరం మేడిగడ్డకు చేరుకొని డ్యామ్ సైట్ను పరిశీలిస్తారు. అక్కడి నుంచి కాటారం వెళ్లి బహిరంగ సభలో పాల్గొని నిధులు విడుదల చేయనున్నారు.
News April 19, 2026
సూర్యాపేటలో 163 BNSS అమలు: ఎస్పీ నరసింహ

సూర్యాపేట జిల్లాలో రేపటి నుంచి 27వ తేదీ వరకు జరగనున్న ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ పరీక్షల నేపథ్యంలో 163 BNSS సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 500 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ తరహాలో ఆంక్షలు ఉంటాయని, గుంపులుగా చేరడం నిషేధమని స్పష్టం చేశారు. పరీక్ష సమయాల్లో సమీపంలోని జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లను మూసివేయాలని ఆదేశించారు.
News April 19, 2026
లైసెన్స్ సర్వేయర్ల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం: జేసీ

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో 235 మంది లైసెన్స్ సర్వేయర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జేసీ వై.మేఘా స్వరూప్ ఆదివారం తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 30వ తేదీలోపు కాకినాడలోని జిల్లా సర్వే, భూమి రికార్డుల కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు చేపడుతున్న ఈ నియామక ప్రక్రియను జిల్లాకు చెందిన అర్హులైన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


