News August 12, 2025
‘ఉచిత బస్సు ప్రయాణం’తో విద్యార్థులకు కష్టాలు..!

ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఉచిత బస్సు ప్రయాణం’ విద్యార్థులకు సమస్యగా మారిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఉమ్మడి మెదక్లో ఈ పథకాన్ని మహిళలు పెద్ద సంఖ్యలో వినియోగించుకుంటున్నారు. బస్సులలో రద్దీ పెరిగి,కళాశాలలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వందల సంఖ్యలో మహిళలు బస్సులో ప్రయాణించడం వల్ల విద్యార్థులకు కష్టంగా మారింది. దీనివల్ల తరగతులకు సమయానికి చేరుకోలేకపోతున్నామని వారు వాపోతున్నారు.
Similar News
News April 19, 2026
VZM: నదిలో పడి వ్యక్తి మృతి

గజపతినగరం(M) పురిటిపెంట ఎస్సీకాలనీకి చెందిన నీలంశెట్టి రమణ(50) చంపావతి నదిలో జారిపడి శనివారం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. వారి వివరాల ప్రకారం.. రమణకు కొన్నేళ్ల కిందట వివాహమైంది. కుటుంబానికి దూరంగా ఉంటున్న ఇతను ఓ ప్రైవేటు దుకాణంలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం అటుగా వెళ్తున్న సమయంలో మద్యం మత్తులో నదిలో ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు.
News April 19, 2026
రాష్ట్రంలో భానుడి భగభగ.. ADBలో 44.3 డిగ్రీలు

TG: రాష్ట్రంలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు అత్యధికంగా ఆదిలాబాద్లో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది. నిజామాబాద్లో 43.1, మహబూబ్నగర్ 42.4, మెదక్ 42, రామగుండం 41.5, హకీంపేట్ 41.1, దుండిగల్ 40.3, భద్రాచలం 40.4, HYD 40.4, నల్గొండ 40, ఖమ్మంలో 40 డిగ్రీలుగా రికార్డయినట్లు వెల్లడించింది.
News April 19, 2026
HYD: MOU దశలో MMTSలో ‘ఫ్రీ ఫేర్’ (1)

MMTSలో ‘<<19687591>>జీరో ఫేర్<<>>’ (ఫ్రీ జర్నీ) ఎందుకో Way2News ఎక్స్క్లూజివ్లో తెలుసుకుందా. TG అవతరణ దినోత్సవం నుంచి ఏడాదిపాటు ప్రతిష్ఠాత్మకంగా నడపాలనే ప్రతిపాదనను CS రామకృష్ణరావు రైల్ నిలయంలో SCR GM సంజయ్ కుమార్ శ్రీవాత్సవ ముందుంచారు. MMTS ద్వారా వచ్చే ఆదాయాన్ని రాష్ట్రప్రభుత్వమే భరిస్తుందని ఆయన స్పష్టంచేశారు. దీనిపై MOU ఇవ్వాలని రైల్వేశాఖ కోరింది. ప్రధానంగా HYDలో ట్రాఫిక్, కాలుష్యం తగ్గించడానికేనని సమాచారం.


