News March 31, 2024

విస్సన్నపేటలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి దుర్మరణం

image

తిరువూరు నియోజకవర్గం విసన్నపేట మండలం నరసాపురం గ్రామంలో ఆదివారం రోడ్డు ప్రమాదం సంభవించింది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో రెడ్డిగూడెం మండలం ముచ్చనపల్లి గ్రామానికి చెందిన యాకోబు (55) అనే వ్యక్తి మృతి చెందినట్లుగా విసన్నపేట పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

Similar News

News September 29, 2025

‘మీ సమస్య ఏదైనా ధైర్యంగా ఫిర్యాదు చేయండి’

image

మచిలీపట్నంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో 38 ఫిర్యాదులు స్వీకరించారు. SP విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో అడిషనల్ SP V.V నాయుడు ఫిర్యాదులను స్వీకరించి చట్టపరంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గుడివాడకు చెందిన వనజ కుటుంబ వేధింపులు, అవనిగడ్డకు చెందిన కిషోర్ ఉద్యోగ మోసం, తోట్లవల్లూరుకు చెందిన వృద్ధుడు నరసయ్య ఆస్తి కోసం తన కుమారులు వేధింపులు, తదితర ఫిర్యాదులు అందాయన్నారు.

News September 28, 2025

హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్‌‌ను సందర్శించిన ఎస్పీ

image

కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు శనివారం గన్నవరం డీఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్, సర్కిల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా రికార్డులు ఎప్పటికప్పుడు అప్డేట్‌గా ఉంచి కేసుల పరిష్కారంలో జాప్యం కాకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. సర్కిల్ పరిధిలో నేరాల నియంత్రణ కోసం రాత్రిపూట గస్తీని పెంచాలన్నారు.

News September 27, 2025

మచిలీపట్నంలో పారిశుద్ధ్య కార్మికులకు శానిటరీ కిట్లు పంపిణీ

image

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచటంలో ఎంతో కీలకపాత్ర పోషిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నం డివిజన్‌లో పని చేస్తున్న పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు కలెక్టర్ చేతుల మీదుగా శానిటేషన్ కిట్లు అందజేశారు. పరిసరాలను శుభ్రం చేస్తూ పర్యావరణాన్ని పరిరక్షించడంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర ఎంతో ఘనమైనదన్నారు.