News August 12, 2025

తిరుమలకు వెళ్లే వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి

image

తిరుమలకు వెళ్లే వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి అని టీటీడీ స్పష్టం చేసింది. ఈ నిబంధన ఈనెల 15 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. భక్తులకు మెరుగైన భద్రతా ప్రమాణాలు, అధిక రద్దీ నివారణ, పారదర్శక సేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఆగస్టు 15 నుంచి ఫాస్టాగ్ లేని వాహనాలను తిరుమలకు అనుమతించబోమని స్పష్టం చేసింది.

Similar News

News August 13, 2025

‘కూలీ’కి రజినీకాంత్ రెమ్యునరేషన్ ఎంతంటే?

image

సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న ‘కూలీ’ మూవీ రేపు విడుదల కానుంది. ఈ సినిమాను రూ.350-రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి రజినీ రూ.150 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. లోకేశ్ కనగరాజ్-రూ.50 కోట్లు, నాగార్జున-రూ.24 కోట్లు, అమిర్ ఖాన్-రూ.20 కోట్లు, ఉపేంద్ర, సత్యరాజ్, శ్రుతిహాసన్-రూ.4 కోట్లు, అనిరుధ్-రూ.15 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టాక్.

News August 13, 2025

లెఫ్ట్ హ్యాండర్స్ ప్రత్యేకతలు ఇవే..!

image

ఇవాళ లెఫ్ట్ హ్యాండర్స్ డే. ప్రపంచ జనాభాలో 10-12 శాతం ఎడమ చేతి వాటం వారు ఉన్నారు. కుడి చేతివారితో పోలిస్తే లెఫ్ట్ హ్యాండర్స్‌కు స్వంతంత్ర భావాలు ఎక్కువ. వీరు ఒకేసారి ఎక్కువ పనులు చేస్తారు. షార్ప్, క్రియేటివిటీ, స్మార్ట్‌గా ఉంటారు. జబ్బు చేసినా, ప్రమాదాల్లో గాయపడినా త్వరగా కోలుకుంటారు. కొన్ని గేమ్స్ బాగా ఆడతారు. మెమొరీ పవర్ ఎక్కువ. వీరి ఆలోచనలు చాలా ఫాస్ట్. వీరిలో మేధావులు, రాజకీయవేత్తలు ఎక్కువ.

News August 13, 2025

మళ్లీ తగ్గిన గోల్డ్ రేట్స్

image

బంగారం దిగుమతులపై ఎలాంటి టారిఫ్‌లు విధించమని ట్రంప్ ప్రకటించడంతో గ్లోబల్ మార్కెట్‌లో గోల్డ్ ధరలు తగ్గాయి. దీంతో HYD బులియన్ మార్కెట్‌లోనూ ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. ఇవాళ 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములపై రూ.50 తగ్గి రూ.1,01,350కు చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములపై రూ.50 పతనమై రూ.92,900 పలుకుతోంది. అటు KG వెండి ధర రూ.1,25,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.