News August 12, 2025

మైత్రివనం.. బురదలో భవనం

image

భారీ వర్షాలకు మైత్రివనం, స్వర్ణజయంతి కాంప్లెక్స్‌ సెల్లార్లలోకి వరద నీరు, వ్యర్థాలు వచ్చి చేరాయి. నీటిని తొలగించి చేతులు దులుపుకున్న అధికారులు వ్యర్థాల గురించి పట్టించుకోవడం లేదు. సెల్లార్లలో ఎక్కడా చూసినా అపరిశుభ్రతనే. దుర్వాసనతో స్థానిక వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. CM ఇన్‌స్పెక్షన్ చేసిన ఏరియాలోనూ నిర్లక్ష్యం ఏంటని నిలదీస్తున్నారు. ఇకనైనా వ్యర్థాలను తొలగించాలని వ్యాపారులు కోరుతున్నారు.

Similar News

News August 30, 2025

రంగారెడ్డి జిల్లా ముసాయిదా ఓటర్ లిస్ట్ ఇదే

image

స్థానిక సంస్థల ఓటర్ల ముసాయిదా జాబితాను జిల్లా ఎన్నికల అధికారి విడుదల చేశారు. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 21 మండలాల పరిధిలో 526 గ్రామపంచాయతీలు ఉండగా వీటి పరిధిలో 7,52,254 మంది ఓటర్లు ఉన్నారని, వీరిలో 3,76,873 మంది పురుషులు, 3,75,353 మంది మహిళలు, 28 మంది ఇతర ఓటర్లు ఉన్నట్లు ప్రకటించారు. వార్డుల వారీగా మొత్తం 4,682 పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. అభ్యంతరాల స్వీకరణ ఇవాళ్టితో లాస్ట్.

News August 30, 2025

రంగారెడ్డి: ఆశవర్కర్లు జ్వర సర్వే చేపట్టాలి: కలెక్టర్

image

సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్న నేపథ్యంలో అన్ని మున్సిపాలిటీలు, గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు, జ్వర సర్వే చేపట్టాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. జిల్లాలో డెంగ్యూ కేసులు ప్రబలే ప్రాంతాలను గుర్తించాలని, ఫాగింగ్, రెసిడ్యుల్ స్ప్రే చేపట్టి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఖాళీ స్థలాల్లో చెత్త తొలగించాలని, ఆశవర్కర్లు ప్రతిరోజు 50 ఇళ్లను సందర్శించి జ్వర సర్వే చేపట్టాలన్నారు.

News August 30, 2025

RR: ఓటర్ లిస్టులో మీ వివరాలు మార్చాలా?

image

పంచాయతీ ఎన్నికల సమరానికి ఓటర్ జాబితా విడుదలైంది. ఈ జాబితాలో పొరపాట్లు ఉన్నా, కొత్తగా నమోదు చేసుకోవాలన్నా, అభ్యంతరం వ్యక్తం చేయాలన్నా MPDO, పంచాయతీ అధికారికి దరఖాస్తు ఇవ్వాలి.
→ Form-6: కొత్తగా పేరు చేర్చుకోవడానికి
→ Form-7: చెల్లని పేరు తొలగించే అభ్యంతరానికి
→ Form-8: పేరు, అడ్రస్, ఇతర కరెక్షన్స్‌కు
→ Form-8A: ఒక వార్డు నుంచి మరో వార్డుకు మారడానికి
నేడే దీనికి ఆఖరు తేది.