News August 12, 2025

ప్రియాంక కామెంట్స్‌కు ఇజ్రాయెల్ అంబాసిడర్ కౌంటర్

image

పాలస్తీనాలో ఇజ్రాయెల్ నరమేధం సృష్టిస్తోందని కాంగ్రెస్ MP ప్రియాంకా గాంధీ ఆరోపించారు. 18,430 మంది పిల్లలు సహా 60వేల మందిని దారుణంగా హతమార్చిందన్నారు. ఇంత జరుగుతున్నా భారత ప్రభుత్వం మౌనంగా ఉండటం సిగ్గుచేటన్నారు. దీంతో హమాస్‌కు వత్తాసు పలకడం మానుకోవాలని ప్రియాంకకు ఇజ్రాయెల్ అంబాసిడర్ అజార్ సూచించారు. పౌరుల మాటున దాక్కున్న ఉగ్రవాదులే తమ లక్ష్యమన్నారు. 25వేల టెర్రరిస్టులను చంపినట్లు చెప్పారు.

Similar News

News August 13, 2025

Asia Cup: వీరిలో చోటు దక్కేదెవరికి?

image

ఆసియా కప్ కోసం భారత జట్టును ఎంపిక చేసేందుకు BCCI మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్‌లలో ఎవరిని సెలక్ట్ చేయాలో తేల్చుకోలేకపోతున్నట్లు సమాచారం. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజూ ఉన్నారు. అలాగే వన్ డౌన్‌లో సూర్య, ఆ తర్వాత తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య ఉన్నారు. మరో స్థానం కోసం ఆ నలుగురి మధ్య పోటీ నెలకొంది. ఎవరిని సెలక్ట్ చేయాలో కామెంట్ చేయండి.

News August 13, 2025

జగన్ హాట్‌లైన్ కామెంట్స్.. స్పందించిన లోకేశ్

image

AP: చంద్రబాబు, రాహుల్ మధ్య <<17390003>>హాట్‌లైన్ <<>>ఉందంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి లోకేశ్ స్పందించారు. ‘మాకు ఏపీ ప్రజలతోనే హాట్‌లైన్ ఉంది. మీ ఓటు చోరీ సాకులను మర్చిపోండి. మీ నోట్‌చోరీ‌తో విసిగి ప్రజలు మిమ్మల్ని దించేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించే మీ ప్రయత్నాలు విఫలమవుతాయి. మోదీ, చంద్రబాబు నాయకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్‌లో ఏపీ మళ్లీ నం.1గా నిలుస్తుంది’ అని ధీమా వ్యక్తం చేశారు.

News August 13, 2025

ఆర్టీసీకి భలే గి‘రాఖీ’

image

TG: రాఖీ పౌర్ణమి సందర్భంగా RTC బస్సుల్లో 6 రోజుల్లో (ఆగస్టు 7-12) 3.68 కోట్ల మంది ప్రయాణించారని TGSRTC వెల్లడించింది. ఇందులో 2.51 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణాలు చేశారని తెలిపింది. పండుగ రోజున (AUG 9) 45.62 లక్షల మంది ప్రయాణించగా, ఈ నెల 11న అత్యధికంగా 45.94L మంది మహిళలతో సహా మొత్తం 68.45L మంది రాకపోకలు సాగించారని పేర్కొంది. ఒక్క రోజులో ఇంత మంది మహిళలు ప్రయాణించడం ఇదే తొలిసారి అని వివరించింది.