News August 12, 2025
మోదీ జీ.. ట్రాఫిక్ నుంచి కాపాడాలంటూ చిన్నారి లేఖ

బెంగళూరులోని ట్రాఫిక్ సమస్య పరిష్కరించాలంటూ ఏకంగా ప్రధాని మోదీకి లేఖ రాసిందో ఐదేళ్ల చిన్నారి. ‘నరేంద్ర మోదీ జీ. ట్రాఫిక్ సమస్య చాలా ఎక్కువగా ఉంది. దీనివల్ల మేము పాఠశాలలకు, ఆఫీసులకు లేటుగా వెళ్తున్నాం. రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి. ప్లీజ్ హెల్ప్ చేయండి’ అని లేఖలో రాసింది. ఈ ఫొటోను ఆ చిన్నారి తండ్రి ట్విటర్లో షేర్ చేయగా వైరలవుతోంది. ఇక్కడ పీక్ టైమ్లో KM ప్రయాణించేందుకు గంట పడుతుందని చెబుతుంటారు.
Similar News
News August 13, 2025
విజయవాడలో 39 పునరావాస కేంద్రాల ఏర్పాటు

AP: భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. విజయవాడలో 39 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. కృష్ణానది, బుడమేరు వాగు పొంగి పొర్లుతున్న నేపథ్యంలో అలర్ట్గా ఉండాలని ప్రజలకు సూచించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని బుడమేరు ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు చర్యలు చేపడుతున్నారు.
News August 13, 2025
భారీ వర్షాలు.. ఈ నంబర్లకు ఫోన్ చేయండి: అనిత

APలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సిద్ధం కావాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. ఆదివారం వరకు జాలర్లు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని, ప్రజలు అత్యవసరమైతే 112, 1070, 18004250101 టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. GNT, NTR, కృష్ణా, బాపట్ల జిల్లా కలెక్టర్లను ఆమె అప్రమత్తం చేశారు.
News August 13, 2025
Asia Cup: వీరిలో చోటు దక్కేదెవరికి?

ఆసియా కప్ కోసం భారత జట్టును ఎంపిక చేసేందుకు BCCI మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, యశస్వీ జైస్వాల్, శుభ్మన్ గిల్లలో ఎవరిని సెలక్ట్ చేయాలో తేల్చుకోలేకపోతున్నట్లు సమాచారం. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజూ ఉన్నారు. అలాగే వన్ డౌన్లో సూర్య, ఆ తర్వాత తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య ఉన్నారు. మరో స్థానం కోసం ఆ నలుగురి మధ్య పోటీ నెలకొంది. ఎవరిని సెలక్ట్ చేయాలో కామెంట్ చేయండి.