News March 31, 2024

కొండపి: చెట్టును ఢీ కొట్టిన బైక్.. ఒకరు మృతి

image

కొండపి మండలంలోని నేతివారిపాలెం సాయిబాబా గుడి వద్ద ప్రమాదం జరిగింది. చీమకుర్తి మండలానికి చెందిన ఇద్దరు యువకులు జరుగుమల్లి మండలం కామేపల్లి పోలేరమ్మ గుడికి బైక్‌పై వెళ్లి వస్తూ మద్యం మత్తులో చెట్టును ఢీకొట్టారు. ఈ ఘటనలో రాగం చరణ్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి పరిస్థితి విషమంగా ఉండటంతో ఒంగోలుకు తరలించారు. ఘటనా స్థలాన్ని కొండపి ఎస్సై కృష్ణబాజీ పరిశీలించారు.

Similar News

News March 13, 2026

పవన్ ‘ఫ్లాప్ స్టార్’: MLA తాటిపర్తి

image

యర్రగొండపాలెం MLA తాటిపర్తి చంద్రశేఖర్ సోషల్ మీడియా వేదికగా DyCM పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. సినిమాల్లో ‘పవర్ స్టార్’ బిరుదు ఎలా వచ్చిందో దేవుడికే తెలుసని వ్యాఖ్యానించిన ఆయన, ప్రభుత్వ పరిపాలనలో మాత్రం ఫ్లాప్ స్టార్ అయిపోయారని ట్వీట్ చేశారు. గత రెండేళ్లలో అటవీ శాఖ ద్వారా కేవలం రూ.83 కోట్ల సంపద మాత్రమే సృష్టించారని, ఆ డబ్బు కూడా షూటింగ్ ట్రిప్పులకే ఖర్చు అయిపోయి ఉంటుందని ఎద్దేవా చేశారు.

News March 13, 2026

ప్రకాశం: మత్స్యకారుడి గొంతులో ఇరుక్కున్న బతికున్న చేప.. చివరికి

image

ప్రకాశం జిల్లాలో గురువారం వింత ఘటన చోటుచేసుకుంది. ఒంగోలుకు చెందిన ఓ మత్స్యకారుడు చేపల వేటకు వెళ్లాడు. అనంతరం చేపలు పట్టి బుట్టలో వేస్తుండగా ఓ చేప ఎగిరి అతని నోటిలో పడింది. తీసేలోపే అది కాస్తా గొంతులోకి వెళ్లింది. గమనించిన తోటి మత్స్యకారులు అతణ్ని వెంటనే ఒంగోలు GGHకు తరలించారు. ENT వైద్యులు HOD డాక్టర్ ప్రభాకర్ బృందం శస్త్రచికిత్స చేసి చాపను బయటకు తీశారు. ప్రస్తుతం సుబ్రహ్మణ్యం ఆరోగ్యంగా ఉన్నారు.

News March 13, 2026

ప్రకాశం: ఓ ఫొటోతో ఆగిన పెళ్లి.. తల్లీకూతుర్లు సూసైడ్

image

ప్రకాశం జిల్లా మార్టూరు (M) ద్రోణాదులలో విషాదం నెలకొంది. స్థానికుల వివరాల మేరకు.. సుజాత (46) కుమార్తె (26) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. మార్టూరు వాసి శేషుబాబుతో డిసెంబర్ 14న ఆమెకు ఎంగేజ్‌మెంట్ జరిగింది. దివ్యకు పరిచయం ఉన్న ఓ యువకుడు ఆమెతో దిగిన ఫొటోను శేషుబాబుకు పంపాడు. దీంతో పెళ్లి ఆగిపోగా.. మనస్తాపంతో దివ్య, సుజాత ఈ నెల 4న పురుగుల మందు తాగారు. గుంటూరులో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు.