News August 12, 2025
ఫ్రీ బస్ స్కీమ్పై BIG UPDATE

AP: రాష్ట్రంలో ఈ నెల 15న స్త్రీ శక్తి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభం కానుంది. ఈ పథకాన్ని ఆ రోజు విజయవాడలోని నెహ్రూ బస్ స్టేషన్లో సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం అమలు కానుంది. కాగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బస్సుల్లో మహిళలకు కేటాయించిన సీట్లకు పసుపు రంగు వేశారు. టిమ్స్లో సాఫ్ట్వేర్ అప్డేట్ చేశారు. కండక్టర్లకు శిక్షణ ఇచ్చారు.
Similar News
News August 17, 2025
PAC భేటీ తర్వాత ఎన్నికలపై క్లారిటీ: మహేశ్ గౌడ్

TG: BCలకు 42% రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని TPCC చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. SEP 30లోపు ఎన్నికల నిర్వహణ సాధ్యం కాకపోతే, కోర్టును మరింత సమయం కోరాలనే ఆలోచనలో CM రేవంత్ ఉన్నట్లు పేర్కొన్నారు. త్వరలో జరిగే పొలిటికల్ అఫైర్స్ కమిటీ(PAC) భేటీలో ఎన్నికలపై క్లారిటీ వస్తుందని చెప్పారు. పార్టీపరంగా రిజర్వేషన్ల కల్పన, ఆర్డినెన్స్ ద్వారా ఎన్నికలకు వెళ్లే అంశాలను పరిశీలిస్తున్నామన్నారు.
News August 17, 2025
చికెన్ ధరలు ఎలా ఉన్నాయంటే?

APలోని పలు ప్రాంతాల్లో చికెన్ ధరలు గతవారంతో పోలిస్తే పెరిగాయి. గతవారం కిలో రూ.220-రూ.230 వరకు అమ్మకాలు జరిగాయి. ఇవాళ పల్నాడులో కిలో రూ.260 వరకు విక్రయిస్తున్నారు. విజయవాడలో రూ.240-రూ.250, గుంటూరు, చిత్తూరులో రూ.200 వరకు అమ్మకాలు జరుపుతున్నారు. అటు హైదరాబాద్లో రూ.190- రూ.210, వరంగల్లో రూ.200, ఖమ్మంలో రూ.210 వరకు పలుకుతోంది. మరి మీ ఏరియాలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయి?
News August 17, 2025
ట్రంప్, పుతిన్ భేటీ.. గెలిచిందెవరు?

US, రష్యా ప్రెసిడెంట్స్ ట్రంప్, పుతిన్ భేటీ కావడం జియోపాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారింది. చర్చలు విఫలమైనప్పటికీ పుతిన్దే విజయమంటూ US మాజీ అధికారులు సైతం చెబుతున్నారు. ట్రంప్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారని అంటున్నారు. కనీసం సీజ్ఫైర్ ప్రస్తావన కూడా తీసుకురాలేదన్నారు. మరోవైపు శత్రుదేశం రెడ్ కార్పెట్ స్వాగతం పలకడం, ఉక్రెయిన్తో యుద్ధాన్ని సమర్థించుకోవడం పుతిన్ సాధించిన విజయంగా అభివర్ణిస్తున్నారు.