News August 12, 2025
మెదక్: ‘ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం అలవర్చుకోవాలి’

ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం అలవర్చుకోవాలని జిల్లా గ్రంథాలయాల సంస్థ ఛైర్ పర్సన్ చిలుముల సుహాసిని రెడ్డి
సూచించారు. నర్సాపూర్ శాఖ గ్రంథాలయంలో నేషనల్ లైబ్రరి డే నిర్వహించారు. ఫాదర్ ఆఫ్ లైబ్రరి సైన్స్గా పిలిచే పద్మశ్రీ S.R రంగనాధన్ జయంతి సంధర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News September 8, 2025
మెదక్: ప్రజావాణి వినతులు స్వీకరించిన ఎస్పీ

మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా ఎస్పీ డీవీ.శ్రీనివాస రావు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి కార్యాలయానికి తరలివచ్చి తమ సమస్యలు నేరుగా ఎస్పీ దృష్టికి తెచ్చారు. పరిష్కారం చేసే వాటిని పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి నేరుగా రావాలన్నారు.
News September 8, 2025
మెదక్: ఇన్స్ స్పైర్ ప్రదర్శనలు చేయాలి: డీఈఓ

ప్రైవేట్ పాఠశాలలు తప్పనిసరిగా ఇన్స్ స్పైర్ ప్రదర్శనలు చేయాలని జిల్లా విద్యాధికారి ప్రొఫెసర్ రాధా కిషన్ సూచించారు. ఓ కళాశాలలో జిల్లాలోని అన్ని ప్రైవేట్, ఉన్నత పాఠశాలల సైన్స్ ఉపాధ్యాయులకు ఇన్స్ స్పైర్ నామినేషన్లపై అవగాహన కల్పించారు. ఈనెల 15లోపు 5 నామినేషన్లు రావాలని తెలిపారు. జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి పాల్గొన్నారు.
News September 8, 2025
ధనూర: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన కలెక్టర్

టేక్మాల్ మండలంలోని ధనూర గ్రామంలో పలువురు లబ్ధిదారులు నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను సోమవారం కలెక్టర్ రాహుల్ రాజ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.