News August 12, 2025
యూరియా ఇష్టారీతిన విక్రయిస్తే చర్యలు: కలెక్టర్

రఘునాథపల్లి మండలంలోని పలు ఎరువుల దుకాణాలను జిల్లా వ్యవసాయ అధికారిణి అంబికా సోనితో కలిసి జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మంగళవారం తనిఖీ చేశారు. రైతులు ఆధార్, పట్టాదారు పాస్ బుక్ జిరాక్స్ తప్పనిసరిగా ఇవ్వాలని, భూమి వివరాలు నమోదు చేసిన తర్వాతనే యూరియా విక్రయించాలని సూచించారు. ఇష్టారీతిన విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News April 17, 2026
సూర్యాపేటలో ఉమ్మడి జిల్లా చెస్ పోటీలు

ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి చెస్ ఎంపిక పోటీలు ఏప్రిల్ 19న సూర్యాపేట టీటీడీ కళ్యాణ మండపంలో జరగనున్నాయి. అండర్ 7, 11, 19 విభాగాల్లో బాలురు, బాలికలకు ఈ పోటీలు నిర్వహిస్తారు. ఎఫ్ఐడీఈ (FIDE) నిబంధనల ప్రకారం ఉదయం 10 గంటలకు టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. ఆసక్తి ఉన్న క్రీడాకారులు వివరాల కోసం 9394753343 నంబర్లో సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.
News April 17, 2026
రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: ఖమ్మం కలెక్టర్

ఖమ్మం నగరంలోని ఆర్టీవో కార్యాలయంలో శుక్రవారం అరైవ్ అలైవ్ కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతని తెలిపారు. గోల్డెన్ అవర్లో సహాయం చేసిన వారికి రాహవీర్ పథకం కింద రూ.25 వేలు బహుమతి అందిస్తామని చెప్పారు. 30 బ్లాక్ స్పాట్ల సరిదిద్దడంతో ప్రమాదాలు తగ్గాయని వివరించారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్పై ఏఐ ద్వారా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News April 17, 2026
తాత్కాలిక సీజ్ఫైర్లు మాకొద్దు: ఇరాన్

లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య 10రోజుల సీజ్ఫైర్ ప్రకటించిన నేపథ్యంలో ఇరాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. లెబనాన్ నుంచి మొదలుకొని ఎర్రసముద్రం వరకు ఈ ఏరియాలో ఎలాంటి అశాంతి లేకుండా ఉండటమే తమకు కావాలని స్పష్టం చేసింది. తాత్కాలిక సీజ్ఫైర్లను ఒప్పుకోబోమని తెలిపింది. ప్రస్తుతం జరుగుతున్న హింస ఇక్కడితో శాశ్వతంగా ఆగిపోవాలని కోరుకుంటున్నట్లు ఆ దేశ డిప్యూటీ విదేశాంగ మంత్రి సయీద్ వెల్లడించారు.


