News August 12, 2025
PIC OF THE DAY.. వందే ‘భారత్’

అచ్చం ఇండియా మ్యాప్లా కనిపిస్తోంది కదూ! ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వందేభారత్ రైళ్లు నడుస్తున్న మార్గం ఇది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒక్కో ట్రాక్తో దేశాన్ని ఇది కలుపుతోందని నీతి ఆయోగ్ మాజీ CEO అమితాబ్ కాంత్ ఈ ఫొటోను ట్వీట్ చేశారు. వందే భారత్ రైలు దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొస్తోందని ఆయన Xలో రాసుకొచ్చారు. కాగా ప్రస్తుతం దేశంలో 150కి పైగా వందేభారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి.
Similar News
News August 13, 2025
AP RAIN UPDATES

* విజయవాడలో భారీ వర్షాలకు ముగ్గురు మృతి. మ్యాన్హోల్లో పడి ఒకరు, డ్రైనేజీలో పడి మరొకరు, చెట్టుకూలి మరో వ్యక్తి మరణించారు.
* మంగళగిరిలో అత్యధికంగా 20cm వర్షం. తెనాలిలో 18, బాపట్లలో 15, అమరావతిలో 14cm వాన పడింది.
* నాగార్జున వర్సిటీ ప్రాంగణంలోకి వర్షపు నీరు చేరడంతో జలదిగ్బంధంలో చిక్కుకున్న విద్యార్థులు
* వర్షాలపై హోంమంత్రి అనిత కాసేపట్లో విపత్తు నిర్వహణ శాఖ కార్యాలయంలో సమీక్ష నిర్వహించనున్నారు.
News August 13, 2025
రాష్ట్రంలో కొత్త జిల్లాలపై BIG UPDATE

AP: జిల్లా, మండల, గ్రామాల పేర్లు, సరిహద్దుల మార్పులపై SEP 15 వరకు తమ నివేదికను CM చంద్రబాబుకు సమర్పించాలని మంత్రుల బృందం(జీవోఎం) నిర్ణయించింది. డిసెంబర్ 31లోగా ఈ ప్రక్రియ ముగించాల్సి ఉందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ప్రజలకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామన్నారు. వీటిపై SEP 2 వరకు ప్రజల అభిప్రాయాలను స్వీకరిస్తామని మంత్రి వెల్లడించారు.
News August 13, 2025
ఇండియన్ సిటిజన్ కాకముందే సోనియాకు ఓటు హక్కు: BJP

ఎలక్షన్ కమిషన్, కేంద్రం కుమ్మక్కై ఓట్ల చోరీకి పాల్పడుతున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలకు BJP కౌంటర్ ఇచ్చింది. సోనియా గాంధీ భారత పౌరురాలు కాకముందే అక్రమంగా ఓటు హక్కు పొందారని ఆరోపించింది. ‘ఇందిరా PMగా ఉన్న సమయంలో 1980-82 మధ్య సోనియా ఓటు హక్కు పొందారు. అప్పటికి ఆమె భారత సిటిజన్ కూడా కాదు. ఇది అధికార దుర్వినియోగం కాక ఇంకేంటి?’ అని BJP నేత అమిత్ మాలవీయా ట్వీట్ చేశారు.