News August 12, 2025

కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నాదెండ్ల బ్రహ్మం

image

AP: రాష్ట్రంలో 31 నామినేటెడ్ పదవులను ప్రభుత్వం భర్తీ చేసింది. కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్-నాదెండ్ల బ్రహ్మం, SC కార్పొరేషన్ ఛైర్మన్-ఆకేపోగు ప్రభాకర్, బ్రాహ్మణ-బుచ్చి రామ్ ప్రసాద్, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్-దాసరి శ్రీనివాసులు, విశ్వబ్రాహ్మణ-కమ్మరి పార్వతి, దూదేకుల-నాగుల్ మీరా కాసునూరి, వైశ్య-రమేశ్ మొదలవలస, జంగం-వి.చంద్రశేఖర్, వడ్డెర-గుంటసల వెంకటలక్ష్మి, OUDA ఛైర్మన్‌గా షేక్ రియాజ్‌ను నియమించింది.

Similar News

News August 17, 2025

చామ దుంపలతో సంపూర్ణ ఆరోగ్యం!

image

చామ దుంపలు తినేందుకు ఆసక్తి చూపేవారు తక్కువగా ఉంటారు. అయితే, వీటితో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ‘ఈ దుంపలతో ఎముకలు బలంగా తయారవుతాయి. కంటిచూపు మెరుగవుతుంది. జీర్ణ వ్యవస్థను సరిచేసి మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించే శక్తి వీటిల్లో ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తాయి. వాటిల్లోని పొటాషియం గుండె ఆరోగ్యానికి మంచిది’ అని అంటున్నారు. SHARE IT.

News August 17, 2025

PAC భేటీ తర్వాత ఎన్నికలపై క్లారిటీ: మహేశ్ గౌడ్

image

TG: BCలకు 42% రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని TPCC చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. SEP 30లోపు ఎన్నికల నిర్వహణ సాధ్యం కాకపోతే, కోర్టును మరింత సమయం కోరాలనే ఆలోచనలో CM రేవంత్ ఉన్నట్లు పేర్కొన్నారు. త్వరలో జరిగే పొలిటికల్ అఫైర్స్ కమిటీ(PAC) భేటీలో ఎన్నికలపై క్లారిటీ వస్తుందని చెప్పారు. పార్టీపరంగా రిజర్వేషన్ల కల్పన, ఆర్డినెన్స్ ద్వారా ఎన్నికలకు వెళ్లే అంశాలను పరిశీలిస్తున్నామన్నారు.

News August 17, 2025

చికెన్ ధరలు ఎలా ఉన్నాయంటే?

image

APలోని పలు ప్రాంతాల్లో చికెన్ ధరలు గతవారంతో పోలిస్తే పెరిగాయి. గతవారం కిలో రూ.220-రూ.230 వరకు అమ్మకాలు జరిగాయి. ఇవాళ పల్నాడులో కిలో రూ.260 వరకు విక్రయిస్తున్నారు. విజయవాడలో రూ.240-రూ.250, గుంటూరు, చిత్తూరులో రూ.200 వరకు అమ్మకాలు జరుపుతున్నారు. అటు హైదరాబాద్‌లో రూ.190- రూ.210, వరంగల్‌లో రూ.200, ఖమ్మంలో రూ.210 వరకు పలుకుతోంది. మరి మీ ఏరియాలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయి?