News August 12, 2025

చందానగర్ ఖజానా జువెలర్స్ దోపిడీ కేసులో పురోగతి

image

HYD చందానగర్ ఖజానా జువెలర్స్ దోపిడీ కేసులో పురోగతి లభించింది. నగర శివారులో ఇద్దరు దుండగులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించారు. దోపిడీ ఘటనపై నిందితులను విచారిస్తున్నట్లు తెలుస్తోంది. దుండగులు వాడిన వెపన్స్, బైక్స్ స్వాధీనం చేసుకున్నారు. కాగా 15 నిమిషాల్లో దోపిడీ చేసి దొంగలు పరారయ్యారు.

Similar News

News April 17, 2026

మన్యం జిల్లాలో మహిళా ఓటర్లే ఎక్కువ..

image

పార్వతీపురం జిల్లాలోని 443 గ్రామ పంచాయతీల ఓటర్ల జాబితాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. మొత్తం 9,72,195 మంది ఓటర్లు నమోదవ్వగా వీరిలో 4,77,857 మంది పురుషులు, 4,94,338 మంది మహిళలున్నారు. పార్వతీపురం మండలంలో అత్యధికంగా 28,449 మంది ఓటర్లు ఉన్నారు. భామిని మండలంలో అత్యల్పంగా 10,429 మాత్రమే నమోదయ్యారు. త్వరలో పంచాయతీ కార్యాలయాల్లో జాబితాలను ప్రదర్శించనున్నారు.

News April 17, 2026

అపార్టుమెంట్లలో EV ఛార్జింగ్ పాయింట్లు

image

TG: భవిష్యత్తు అవసరాల దృష్ట్యా GOVT, PVT భాగస్వామ్యంలో మరిన్ని EV ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని CS రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. EVల సంఖ్య పెరుగుతున్నందున గ్రామీణ, పట్టణ ప్రజలకు వీటిని అందుబాటులో ఉంచాలన్నారు. వీటి మ్యాపింగ్‌కు డ్యాష్ బోర్డును అభివృద్ధి చేయాలన్నారు. నగరాల్లోని అపార్టుమెంట్లలో ఈ ఛార్జింగ్ పాయింట్లను తప్పనిసరి చేయనున్నట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ తెలిపారు.

News April 17, 2026

గంగ జాతరకు CM చంద్రబాబుకు ఆహ్వానం

image

కుప్పం శ్రీప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరకు సతీసమేతంగా రావాలంటూ CM చంద్రబాబుకు గంగమ్మ గుడి ఛైర్మన్ BMK రవిచంద్రబాబు ఆహ్వాన పత్రికను అందజేశారు. అమరావతిలో CMను ఆయన నివాసానికి వెళ్లి జాతర ఆహ్వాన పత్రిక ఇచ్చారు. గంగ జాతరలో భాగంగా మే 20న అమ్మవారి విశ్వరూప దర్శనం రోజు CM చంద్రబాబు దంపతులు రానున్నట్లు సమాచారం.