News August 12, 2025
HYD: Ed.CET ఫేజ్-1 ఫలితాలు విడుదల

Ed.CET 2025 ఫేజ్-1 అలాట్మెంట్ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఫలితాలను విడుదల చేసినట్లుగా HYD ఉస్మానియా అధికారులు తెలిపారు. ఫలితాలను https://edcetadm.tgche.ac.in/ వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకునే అవకాశం ఉన్నట్లుగా వివరించారు. అభ్యర్థులకు వచ్చిన కాలేజీలలో అన్ని ధ్రువీకరణ పత్రాలను ఆగస్టు 14 వరకు సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
Similar News
News April 18, 2026
సంబేపల్లెలో గురుకుల విద్యార్థిని మృతి

సంబేపల్లె మండలం ఎర్రగుంట్లలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల కళాశాలలో చదువుతున్న రెడ్డిరాణి 14 (9వ తరగతి) విద్యార్థి శనివారం తెల్లవారుజామున మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. విద్యార్థినికి శ్వాస పీల్చుకోవడం కష్టంగా ఉండడంతో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో మృతి చెందినట్లు సమాచారం. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
News April 18, 2026
ప.గో : పెట్రోల్ బంకుల్లో జిమ్మిక్కులు…!

జిల్లాలోని పలు పెట్రోల్ బంకుల్లో సిబ్బంది జిమ్మిక్కులు చేస్తున్నారని సమాచారం. వాహనాల్లోకి పెట్రోల్ నింపకుండానే నిండినట్లుగా సొమ్ములు వసూలు చేసి, వాహనదారులు నిలదీస్తే కాళ్ల బేరానికి వస్తున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. గురువారం రాత్రి పెంటపాడు (M) అలంపురం ఒక పెట్రోల్ బంకులో ఇటువంటి సంఘటన చోటు చేసుకుంది. పెట్రోలు కొట్టించి బంకు కూడా దాటకుండానే వాహనం ఆగిపోవడంతో సిబ్బందిని నిలదీసినట్లు తెలిసింది.
News April 18, 2026
MBNR: అక్కడ.. 43.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

మహబూబ్ నగర్ జిల్లాలో వేసవి ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో చిన్న చింతకుంట మండలం వడ్డేమాన్ 43.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. గండీడ్ మండలం సల్కర్పేట 43.6, దేవరకద్ర 43.1, కోయిలకొండ మండలం పారుపల్లి, భూత్పూర్ మండలం కొత్త మొల్గర 42.9, మేడ్చల్ మండలం దోనూరు కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 42.5, అడ్డాకుల 42.4, మహమ్మదాబాద్ 42.3, MBNR (U/R) 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.


