News August 13, 2025
సంగారెడ్డి: విద్యార్థుల ఎఫ్ఆర్ఎఫ్ వెంటనే పూర్తి చేయాలి: డీఈవో

ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల ఎఫ్ఆర్ఎస్ వెంటనే పూర్తి చేయాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. 2,090 మంది విద్యార్థుల ఎఫ్ఆర్ఎస్ ఇంకా పూర్తి కాలేదని పేర్కొన్నారు. 13వ తేదీ వరకు విద్యార్థుల ఎఫ్ఆర్ఎస్ 100% పూర్తి చేయాలని సూచించారు. లేకుంటే సంబంధిత ప్రధానోపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News April 18, 2026
నేడు 2 మ్యాచులు.. SRHపై ధోనీ ఆడతారా?

IPLలో ఇవాళ డబుల్ ధమాకా ఉండనుంది. 3.30PMకు ఢిల్లీ, బెంగళూరు తలపడనున్నాయి. ఆడిన 5 మ్యాచుల్లో 4 గెలిచి RCB జోరు మీద ఉండగా, చివరి 2 మ్యాచుల్లో ఓడి DC కష్టాల్లో ఉంది. మరోవైపు 7.30PMకు SRH, CSK మధ్య కీలక పోరు జరగనుంది. ఈ సీజన్లో ఇరుజట్లూ చెరో 2 గెలిచి, 3 ఓడాయి. అయితే వరుసగా 2 మ్యాచుల్లో గెలవడం, ధోనీ ఆడే అవకాశం ఉండటం చెన్నైకి కలిసొచ్చే అంశం. మరోవైపు SRH బ్యాటింగ్లో అదరగొడుతున్నా బౌలింగ్లో తేలిపోతోంది.
News April 18, 2026
దోమకొండ: పురాతన మహాదేవుని ఆలయాన్ని దర్శించారా?

దోమకొండ సంస్థానంలోని కామినేని వంశస్థులు నిర్మించిన మహా దేవుని పురాతన ఆలయం ఎంతో ప్రసిద్ధి. ఈ ఆలయం కాకతీయుల వాస్తుశిల్పిని పోలి ఉంటుంది. దోమకొండ కోట నిర్మాణం జరిగిన సమయంలోనే క్రీ.శ.18వ శతాబ్దంలో నిర్మించారు. గర్భాలయం, నంది విగ్రహం, శిల్పకళ నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఆధ్యాత్మిక ప్రాముఖ్యతకు పేరు కలిగిన ఈ ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఆధ్యాత్మిక ప్రశాంతతకు అనువైన స్థలం.
News April 18, 2026
వర్షాకాల సమావేశాల్లో మళ్లీ మహిళా బిల్లు?

మహిళా రిజర్వేషన్ల బిల్లును మరోసారి లోక్సభ ముందుకు కేంద్రం తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. జులైలో జరిగే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. దాంతోపాటే డీలిమిటేషన్ బిల్లునూ సభ ముందు ఉంచాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ జరగబోయే కేంద్ర క్యాబినెట్ మీటింగ్లో ఏం నిర్ణయం తీసుకోనున్నారనేది ఆసక్తికరంగా మారింది.


