News August 13, 2025
BREAKING: భారీ వర్షాలు.. రెండ్రోజులు స్కూళ్లకు సెలవులు

TG: భారీ వర్ష సూచన దృష్ట్యా విద్యాశాఖ ఐదు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. రేపు, ఎల్లుండి సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హనుమకొండ, వరంగల్, జనగామ, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్ జిల్లాల్లో రేపు, ఎల్లుండి స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం రేపు, ఎల్లుండి ఒంటిపూట బడులు ఉంటాయని వెల్లడించింది.
Similar News
News August 13, 2025
Asia Cup: వీరిలో చోటు దక్కేదెవరికి?

ఆసియా కప్ కోసం భారత జట్టును ఎంపిక చేసేందుకు BCCI మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, యశస్వీ జైస్వాల్, శుభ్మన్ గిల్లలో ఎవరిని సెలక్ట్ చేయాలో తేల్చుకోలేకపోతున్నట్లు సమాచారం. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజూ ఉన్నారు. అలాగే వన్ డౌన్లో సూర్య, ఆ తర్వాత తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య ఉన్నారు. మరో స్థానం కోసం ఆ నలుగురి మధ్య పోటీ నెలకొంది. ఎవరిని సెలక్ట్ చేయాలో కామెంట్ చేయండి.
News August 13, 2025
జగన్ హాట్లైన్ కామెంట్స్.. స్పందించిన లోకేశ్

AP: చంద్రబాబు, రాహుల్ మధ్య <<17390003>>హాట్లైన్ <<>>ఉందంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి లోకేశ్ స్పందించారు. ‘మాకు ఏపీ ప్రజలతోనే హాట్లైన్ ఉంది. మీ ఓటు చోరీ సాకులను మర్చిపోండి. మీ నోట్చోరీతో విసిగి ప్రజలు మిమ్మల్ని దించేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించే మీ ప్రయత్నాలు విఫలమవుతాయి. మోదీ, చంద్రబాబు నాయకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్లో ఏపీ మళ్లీ నం.1గా నిలుస్తుంది’ అని ధీమా వ్యక్తం చేశారు.
News August 13, 2025
ఆర్టీసీకి భలే గి‘రాఖీ’

TG: రాఖీ పౌర్ణమి సందర్భంగా RTC బస్సుల్లో 6 రోజుల్లో (ఆగస్టు 7-12) 3.68 కోట్ల మంది ప్రయాణించారని TGSRTC వెల్లడించింది. ఇందులో 2.51 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణాలు చేశారని తెలిపింది. పండుగ రోజున (AUG 9) 45.62 లక్షల మంది ప్రయాణించగా, ఈ నెల 11న అత్యధికంగా 45.94L మంది మహిళలతో సహా మొత్తం 68.45L మంది రాకపోకలు సాగించారని పేర్కొంది. ఒక్క రోజులో ఇంత మంది మహిళలు ప్రయాణించడం ఇదే తొలిసారి అని వివరించింది.