News March 31, 2024
ఈతకు వెళ్లే వారి పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి:SP

నల్లగొండ: వేసవికాలం సమీపిస్తున్న తరుణంలో చిన్న పిల్లలు, యువకులు ఈత సరదా కొరకు వెళ్లి ఈత రాకపోవడంతో ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఉన్నాయని జిల్లా ఎస్పీ చందన దీప్తి తెలిపారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలనీ, బావులు, చెరువులు, కాల్వల వద్ద ఈత చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పాఠశాలలు లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో యువకులు, పిల్లలు స్నేహితులతో కలిసి ఈతకు వెళ్తుంటారని తెలిపారు.
Similar News
News March 21, 2026
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కోమటిరెడ్డి

రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ముస్లింలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసంలో ముస్లింలు 30 రోజుల పాటు భక్తిశ్రద్ధలతో కఠోర దీక్షలు, ప్రార్థనలు చేశారని ఆయన పేర్కొన్నారు. అల్లా దయతో వారందరి జీవితాల్లో సంతోషం, వెలుగులు నిండాలని మనస్ఫూర్తిగా ఆయన ఆకాంక్షించారు. ముస్లింల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని వివరించారు.
News March 21, 2026
NLG: వరి కోతల వేళ.. వరుణుడి గోల

జిల్లా వ్యాప్తంగా సాగు చేసిన వరి పంట కోత దశకు చేరుకుంది. ఆయకట్టు ప్రాంతంలో ఎటుచూసినా పచ్చని పొలాలు మరో వారం, పది రోజుల్లో జిల్లాలో కోతల సందడి మొదలుకానుంది. అయితే, గత కొద్ది రోజులుగా ఆకాశం మబ్బులు పడుతుండడంతో రైతన్నల్లో వరుణుడి భయం వెంటాడుతోంది. ఈ రబీ సీజన్లో సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు, వివిధ చెరువులు, బోర్ల కింద జిల్లావ్యాప్తంగా సుమారు 5.56 లక్షల ఎకరాల్లో వరి సాగైంది.
News March 21, 2026
NLG: వరి కోతల వేళ.. వరుణుడి గోల

జిల్లా వ్యాప్తంగా సాగు చేసిన వరి పంట కోత దశకు చేరుకుంది. ఆయకట్టు ప్రాంతంలో ఎటుచూసినా పచ్చని పొలాలు మరో వారం, పది రోజుల్లో జిల్లాలో కోతల సందడి మొదలుకానుంది. అయితే, గత కొద్ది రోజులుగా ఆకాశం మబ్బులు పడుతుండడంతో రైతన్నల్లో వరుణుడి భయం వెంటాడుతోంది. ఈ రబీ సీజన్లో సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు, వివిధ చెరువులు, బోర్ల కింద జిల్లావ్యాప్తంగా సుమారు 5.56 లక్షల ఎకరాల్లో వరి సాగైంది.


