News August 13, 2025
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి: కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కథలాపూర్ మండలం భూషణరావుపేటలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. ఇండ్ల నిర్మాణాలు వేగంగా జరిగేలా లబ్ధిదారులను ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా నిర్మాణాలు పూర్తి చేయడానికి చొరవ చూపాలని కలెక్టర్ సూచించారు.
Similar News
News April 18, 2026
HNK: నేడైనా రిజిస్ట్రేషన్లు అయ్యేనా..?

రిజిస్ట్రేషన్ ఆఫీస్ మెయిన్ సెంట్రల్ సర్వర్ శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మొరాయించింది. దీంతో వరంగల్లోని రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఒక్క రిజిస్ట్రేషన్ కూడా కాలేదు. ఇక్కడ 98 స్లాట్లు ప్రతీ రోజు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాల్సి ఉండగా, ఒక్క రిజిస్ట్రేషన్ కూడా కాలేదు. శనివారం సర్వర్ అందుబాటులోకి వస్తే శుక్రవారం నాటి స్లాట్లు రీషెడ్యూల్ చేసుకుని రిజిస్ట్రేషన్లు పూర్తి కానున్నాయి.
News April 18, 2026
VJA: హోటల్లో క్రికెట్ బెట్టింగ్.. నలుగురి అరెస్ట్

విజయవాడ భారతీనగర్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పటమట, టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ హోటల్లో గుట్టుచప్పుడు కాకుండా బెట్టింగ్ సాగిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. నిందితులు గణేశ్, ప్రసాద్, శ్రీనివాసరావు, రంగబాబులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి రూ. 2 లక్షల నగదు, ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకున్నారు.
News April 18, 2026
అమెరికాలో అంతర్యుద్ధం.. కాకినాడకు లాభం!

1861లో అమెరికాలో మొదలైన అంతర్యుద్ధం కాకినాడ దశను మార్చేసిందని మీకు తెలుసా?. అమెరికా నుంచి పత్తి సరఫరా నిలిచిపోవడంతో బ్రిటన్లో మిల్లులకు తీవ్రమైన పత్తి కొరత ఏర్పడింది. ఆ సమయంలో గుంటూరు ప్రాంత పత్తిని ప్రపంచానికి ఎగుమతి చేసే ఓడరేవుగా కాకినాడ అవతరించింది. ఒక విదేశీ అంతర్యుద్ధం మన కాకినాడ నగరాన్ని ప్రపంచ వాణిజ్య పటంలో నిలబెట్టడం విశేషం.


